Actor Naresh’s : సీనియర్ నటుడు నరేష్ ‘సీరియస్ కామెడీ’ చేస్తున్నారా.?

Actor Naresh’s : సీనియర్ నటుడు నరేష్ మళ్ళీ వివాదాల్లోకెక్కారు. కొన్నాళ్ళ క్రితం యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైతే, ఆ సమయంలో నరేష్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆ వ్యాఖ్యలపై ఆయన వివరణ ఇచ్చుకున్నారు కూడా. దాంతో, ఆ వివాదం ఎలాగో సద్దుమణిగింది.

ఇక, తాజా వివాదం విషయానికొస్తే, నరేష్ భార్య రమ్య పలువుర్ని బురిడీ కొట్టించి ఆర్థికంగా ముంచేసింది. ఆమె మోసాలకు సంబంధించి కేసులు నమోదయ్యాయి. బాధితులు పోలీసుల్ని ఆశ్రయిస్తున్నారు. నరేష్‌కి కూడా ఈ విషయమై బాధితులు వివిధ మార్గాల్లో మొరపెట్టుకుంటున్నారు.

చిత్రమేంటంటే, నరేష్ తన భార్య రమ్యతో తనకు ఎలాంటి సంబంధాల్లేవని అంటున్నారు. ఈ తరహా మోసాల వల్లనే తాను తన భార్యకు దూరంగా వుంటున్నట్లు చెప్పారాయన. ‘పెళ్ళయిన రెండేళ్ళకే మేం విడిపోయాం..’ అన్నది నరేష్ వెర్షన్.

అయితే, నరేష్ చాలా సీరియస్‌గా కామెడీ చేసేస్తున్నారంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. తన భార్యగా వున్నప్పుడే ఆమె ఇలాంటి మోసాలకు పాల్పడిందనీ, దాంతో ఆమెకు దూరంగా వుంటున్నానని నరేష్ చెప్పడం కట్టు కథ అనీ సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

కోట్ల రూపాయల మేర రమ్య మోసాలకు పాల్పడిందంటే, ఆషామాషీ వ్యవహారం కాదు. నరేష్ పేరు చెప్పి అలాగే పలువురు రాజకీయ ప్రముఖుల పేరు చెప్పి నరేష్ సతీమణి (మాజీ అట..) మోసాలకు పాల్పడిన వ్యవహారం సినీ పరిశ్రమలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ‘మా’ ఎన్నికల సమయంలో ఎగిరెగిరి పడ్డ నరేష్, ఇప్పుడిలా ఇరుక్కపోవడాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో కామెంట్లు వైరల్ అవుతున్నాయి.