Sandeep Reddy-Ram Charan: సందీప్ రెడ్డి వంగాకు చరణ్, ఉపాసనలు ఊహించని గిఫ్ట్.. అదేంటో తెలుసా?

Sandeep Reddy-Ram Charan: డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా గురించి మనందరికీ తెలిసిందే. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ వంటి బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్ సినిమాలతో స్టార్ డైరెక్టర్ల లిస్టులో చేరిపోయారు. అయితే చివరిగా సందీప్ రెడ్డి యానిమల్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సందీప్ దేవుడు పాన్ ఇండియా హీరో ప్రభాస్ తో స్పిరిట్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్లు ఒకదాని తర్వాత ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో భాగంగానే తాజాగా సినిమాలో హీరోయిన్ ఎవరు అన్న విషయం హాట్ టాపిక్ గా మారింది.

మొదట స్పిరిట్ లో దీపిక పదుకొణెను హీరోయిన్ గా నటిస్తుదని ప్రచారం జరిగింది. అయితే ఏమైందో తెలియదు కానీ ఇప్పుడు త్రిప్తి డిమ్రీని అధికారికంగా ఎంపిక చేశారట. దీపికను తొలగించారా? లేక ఆమె తప్పుకుందా? అనే విషయంలో క్లారిటీ లేదు కానీ మొత్తానికి స్పిరిట్ సినిమాలో దీపిక లేదు. ఈ విషయంపై సందీప్ రెడ్డి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టడం, అలాగే దీనికి కౌంటర్ గా ఉండేలా దీపిక కూడా ఒక పోస్ట్ పెట్టడం హాట్ టాపిక్ గా మారింది. ఈ వివాదం కొనసాగుతుండగానే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు సందీప్ రెడ్డి వంగాకు ఒక సర్ ప్రైజ్ గిఫ్ట్ పంపించారు.

 

ఈ విషయాన్ని అతనే సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. అంతేకాదు ఈ సందర్భంగా మెగా కపుల్ కు ధన్యవాదాలు కూడా తెలిపాడీ క్రేజీ డైరెక్టర్. మెగాస్టార్ చిరంజీవి సతీమని సురేఖ, అలాగే మెగా కోడలు ఉపాసన కలిసి అత్తమ్మాస్ కిచెన్ పేరుతో పలు ఆహార ఉత్పత్తులు విక్రయిస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఆవకాయ పచ్చడిని కూడా అత్తమ్మాస్ కిచెన్ మెనూలో చేర్చారు. ఈ క్రమంలోనే సమ్మర్ లో స్పెషల్ గా పెట్టిన ఆవకాయ్ జాడీని సందీప్ రెడ్డికి పంపించారు రామ్ చరణ్ దంపతులు. ఇందుకు సంబంధించిన పొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు డైరెక్టర్. తనకు స్పెషల్ గిఫ్ట్ పంపించిన రామ్ చరణ్‌, ఉపాసనకు స్పెషల్ థాంక్స్ చెప్పాడు. ఆవకాయ టేస్ట్ కూడా చాలా బాగుందంటూ రివ్యూ కూడా ఇచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.