ఎన్టీఆర్ షోలో సామ్ భారీ మొత్తం గెలిచిందట.!

మన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతా ఈ మధ్యనే తన వివాహ బంధం నుంచి ఒక కంప్లీట్ బ్రేక్ తీసుకొని ఫ్రెష్ గా మళ్ళీ తన కొత్త జీవితాన్ని ఆరంభించిన సంగతి తెలిసిందే. ఈ ఇష్యూ నుంచి కాస్త సామ్ అభిమానులకు ఉపశమనం ఇచ్చేలా ఓ టాక్ ఈ మధ్య బయటకి వచ్చింది. అదే సమంతా యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా చేస్తున్న మరో ఇంట్రెస్టింగ్ రియాలిటీ షో “ఎవరు మీలో కోటీశ్వరులు” కి గెస్ట్ గా హాజరు అయ్యిందని.

అయితే తాను గెస్ట్ గా రావడమే కాకుండా భారీ మొత్తంలో గెలిచినట్టు తెలుస్తుంది. తాను ఏకంగా ఈ షోలో 25 లక్షలు గెలిచిందట.. ఇప్పుడు ఆ చెక్ పట్టుకొని ఉన్న సమంతా ఫోటో వైరల్ అవుతుంది. దీనితో తాను ఈ షోకి వచ్చినట్టుగా ఇంకా ఇంత మొత్తం గెలుచుకున్నట్టుగా రెండు విషయాలు కన్ఫర్మ్ చేసింది. ఇక ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ ని షో యాజమాన్యం ఓ స్పెషల్ డే కి ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది.