Samantha : ఆ పని చేసి నెటిజన్స్ ట్రోల్స్ కి గురవుతున్న సామ్..!

Samantha : సమంత అనగానే అందరి హీరోలతో హిట్ సినిమాలు తీసిన లక్కీగర్ల్ గా అనిపిస్తుంది. తన కెరీర్ ను చాలా చక్కగా ప్లాన్ చేసుకుంటూ మంచి ప్రాజెక్టలను ఎంచుకుంటున్న సమంత చాలా ఇంటర్వ్యూల్లో డబ్బు విలువ గురించి చెప్తూ ఉంటుంది. తాను సేవ కార్యక్రమాల్లో కూడా ఎపుడు ముందుంటుంది.అయితే తన వ్యక్తిగత జీవితం లో నాగ చైతన్యతో వివాహం తర్వాత మళ్ళీ విడాకులు తీసుకోవడంతో సామ్ డిప్రెషన్ లోకి వెళ్లిందని అందరు అనుకున్నారు. కానీ తను మాత్రం రెట్టింపు ఉత్సాహంతో తన కెరీర్ లో అడుగులు వేస్తోంది.

భారీ బడ్జెట్ సినిమాల్లో అవకాశాలు అందిపుచుకుంటూ కుర్ర హీరోయిన్లకు కంటిమీద కుంకుమ లేకుండా చేస్తోంది. సామ్ ఒక్కో సినిమా కు పారితోషకం కూడా పెంచేసింది. ఏకంగా అమ్మడు 3 కోట్లు తీసుకుంటుందని సమాచారం. ఇక విజయ్ దేవరకొండ తో ఒక సినిమా కు సైన్ చేసిన సామ్ ఎక్కువగా మొత్తం పారితోషకం డిమాండ్ చేస్తోందట. ఇక యశోదర, శాకుంతలం వంటి పాన్ ఇండియా సినిమాలు శరవేగంగా షూటింగ్ జరుగుతున్నాయి. ఇక సామ్ తమిళ మూవీ విజయ్ సేతుపతి నయనతారతో కలిసి నటించినా చిత్రం రెడీ అయింది. ఇలా అన్ని భాషల్లోను సామ్ బిజీ గా ఉంటూనే మళ్ళీ కమర్షియల్ యాడ్స్ చేస్తూ రెండు చేతుల సంపాదిస్తోంది అటు సినిమాలు ఇటు వ్యాపారం మరియు యాడ్స్ తో అమ్మడు ఇల్లు చక్కబెట్టుకుంటోంది.

అయితే ఇటీవల సామ్ చేసిన ఒక మద్యానికి సంబందించిన యాడ్ ఇపుడు సోషల్ మీడియా లో ట్రోల్ కి గురవుతోంది.ఆల్కహాల్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా మారి ప్రమోషన్ చేస్తూ కనిపించింది. చేతిలో గ్లాస్ అది ఇది లేకపోయినా ప్రమోషనల్ యాడ్ లో మాత్రం మితిమీరి మతి అందాలను ఆరబోసింది. ఎద అందాలను ఆరబోస్తూ కొంచెం బోల్డ్ లుక్ లో కనిపించింది. దీంతో నెటిజన్స్ అమ్మడిని ఏకిపారేస్తున్నారు.. స్టార్‌ హీరోయిన్‌ అనే సంగతే మరిచిపోయావా.. విడాకుల తరువాత ఇంతలా దిగజారాలా అని కొందరు.. ఛీఛీ .. డబ్బు కోసం ఎంతకైనా దిగుజారతావా.. అని మరికొందరు గట్టిగా ట్రోల్ చేస్తున్నారు. ఇక మరికొందరు ఇలా చేస్తుంది కాబట్టే అక్కినేని ఫ్యామిలీ ఈమెను వదిలించుకుంది అంటూ గట్టిగా విమర్శిస్తున్నారు.. మరి ఈ కామెంట్స్ పై సామ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.