అయ్యో సమంతా.! అనుకున్నది ఒకటి అయ్యిందొకటి ఇప్పుడెలా.?

నాగ చైతన్యతో విడాకులు తీసుకునే నేపథ్యం దృష్ట్యా తనపై దుష్ప్రచారాలు చేశారన్న నెపంతో కొన్ని యూ ట్యూబ్ ఛానెళ్లపై సమంత పరువు నష్టం దావా వేస్తూ, కోర్టునాశ్రయించిన సంగతి తెలిసిందే. కోర్టు తనకు అనుకూలంగా తీర్పు చెబుతుందనుకున్న సమంతకు షాక్ తగిలింది.

సెలబ్రిటీల పర్సనల్ డిటెయిల్స్, పబ్లిక్ డొమైన్లో పెట్టేది వారే. తిరిగి మళ్లీ వారి పరువుకు నష్టం కలిగింది.. అని ఆరోపించేది వారే.. పరువు నష్టం దావా వేసే బదులు సదరు ఛానెళ్లను క్షమాపణ కోరితే సరిపోయేది కదా.. అని కోర్టు పేర్కొంది. నిజంగా ఇది సమంతకు షాకింగ్ అనే చెప్పాలి.

సమంత తరపు న్యాయవాది శాయ శక్తులా తన తరపు వాదను వినిపించారు. కానీ, కోర్టు తరువాతి రోజుకు ఈ కేసును వాయిదా వేసింది. పాపం సమంత ఒకటి అనుకుంటే ఇంకోటి జరిగిందే. అసలే డివోర్స్ ఇష్యూకి సంబంధించి చెప్పుకోలేని వేదన అనుభవిస్తున్న సమంతకు కోర్టు ట్విస్టు పుండు మీద కారం చల్లినట్లయ్యిందే.. అని నెటిజన్లు ఫీలవుతున్నారు.