సమంత హర్టయ్యింది: ఆ ఛానెల్‌పై పరువు నష్టం దావా వేసింది

అక్కినేని కోడలి హోదా నుంచి తప్పుకున్నాక సమంతపై నిత్యం ట్రోల్స్ వినిపిస్తూనే ఉన్నాయి. వాటిని ఎంతగా సమర్ధించుకున్నా ఆ ట్రోల్స్‌కి చెక్ పడడం లేదు. ఇక సహించలేని సమంత కోర్టునాశ్రయించింది. తన పరువుకు భంగం కలిగేలా తనపై అసభ్య ప్రచారం చేస్తున్న కొన్ని యూ ట్యూబ్ ఛానెల్స్‌పై సమంత పరువు నష్టం దావా వేస్తూ కోర్టునాశ్రయించింది.

సుమన్ టీవీ, తెలుగు పాపులర్ టీవీ తదితర యూ ట్యూబ్ ఛానెల్స్‌పై పరువు నష్టం దావా వేస్తూ, కూకట్ పల్లి కోర్టులో సమంత ఫిటిషన్ వేసింది. తనపై జరుగుతున్న ఈ దుష్ప్రచారాలకు అడ్డుకట్ట వేసేలా వారిని హెచ్చరించాలని కోర్టును కోరింది సమంత. సమంత తరపు న్యాయవాది ఈ ఫిటిషన్‌పై తన వాదనను వినిపించనున్నారు.

సమంత నుంచి ఈ మూవ్ ఊహించి ఉండరు సదరు ఛానెల్ నిర్వాహకులు. విడాకులు అనేది సమంత పర్సనల్ విషయం. అక్కినేని కుటుంబ సమస్య. ఆ సమస్యను అక్కినేని కుటుంబ సభ్యులు ఎలా పరిష్కరించుకోవాలో అలా పరిష్కరించుకుంటారు. అంతేకానీ, అవకాశం ఉంది కదా.. అని అత్యుత్సాహం చూపిస్తే, అనవసరంగా ఇలాంటి చిక్కుల్లోనే పడాల్సి వస్తుంది మరి.