నాగ చైతన్య ని మళ్ళీ టార్గెట్ చేసిన సమంత

కొన్నాళ్ళు ప్రేమించుకుని పెళ్లిచేసుకున్న నాగ చైతన్య, సమంత నాలుగు సంవత్సరాల తర్వాత విడాకులు తీసుకున్నారు. వీళ్ళ విడాకులు అందర్నీ షాక్ కి గురిచేశాయి. బోల్డ్ షో, ఫామిలీ మాన్ వెబ్ సిరీస్ లో నటించడం వల్లనే ఇద్దరి మధ్య గొడవలు వచ్చాయని, అదే విడాకులకు దారి తీసిందని వార్తలు వచ్చాయి. కానీ అస్సలు కారణం మాత్రం తెలియదు.

విడాకుల తర్వాత నాగ చైతన్య కాం గా ఉంటె, సమంత మాత్రం ఛాన్స్ దొరికినప్పుడల్లా నాగ చైతన్య, అక్కినేని ఫామిలీ ని టార్గెట్ చేస్తూనే ఉంది. ఈ మధ్య కాఫీ విత్ కరణ్ షోలో తనకు 250 కోట్ల భరణం ఇచ్చారు అనే వార్తలను ఖండించింది. అలాగే నాగచైతన్యను తనను ఒకే రూమ్ లో ఉంచితే కచ్చితంగా కత్తులను దూరంగా ఉంచాలంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది.

కొన్నాళ్ళు సోషల్ మీడియా కి దూరంగా వున్న సమంత  లేటెస్ట్ గా సోషల్ మీడియాలో.. ‘కింద పడ్డాను కానీ వెనక్కి తగ్గలేదు’ అంటూ ఒక పోస్ట్ పెట్టింది. ఇది కేవలం నాగ చైతన్యని ఉద్దేశించి పెట్టింది అంటూ ప్రచారం మొదలైంది. విడాకుల తర్వాత తప్పంతా సమంతా చేసింది అంటూ ఈమెపై ఎంతో ప్రచారం జరిగింది. తనపై తప్పుడు వార్తలు రాసిన వాళ్లను కోర్టుకు ఈడుస్తాను అంటూ వార్నింగ్ కూడా ఇచ్చింది సమంత. సరిగ్గా ఇలాంటి సమయంలో ఇప్పుడు కిందపడ్డాను కానీ వెనక్కి తగ్గలేదు అంటూ చేసినా పోస్ట్ నాగ చైతన్యను ఉద్దేశించి అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు.