హోస్ట్ అండ్ గెస్ట్‌గా మారిన స‌మంత‌- నాగ చైత‌న్య‌.. ఇంట్లోనే ప‌డి ఉంటాడ‌ని చివ‌ర‌కి పిలిచావు అన్న చై

టాలీవుడ్ మోస్ట్ ల‌వ‌బుల్ క‌పుల్స్ లో నాగ చైత‌న్య‌- స‌మంత ఒక‌రు. వీరిని చూస్తే చాలా చూడ‌ముచ్చ‌ట‌గా అనిపిస్తుంటుంది. వ‌ర్క్స్‌తో ఎంత బిజీగా ఉన్న‌ప్ప‌టికీ, ప‌ర్స‌న‌ల్ లైఫ్‌ను మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు. క‌రోనా వ‌ల‌న కొన్నాళ్ల పాటు ఇంటికే ప‌రిమితమైన ఈ జంట ఇటీవ‌ల మాల్దీవుల‌కి వెళ్ళారు. అక్క‌డ కొద్ది రోజుల పాటు ఎంజాయ్ చేసిన త‌ర్వాత హైద‌రాబాద్‌కు వ‌చ్చారు. ఇక రీసెంట్‌గా న్యూ ఇయ‌ర్ వేడుక‌లు జ‌రుపుకునేందుకు గోవా వెళ్ళారు. అక్క‌డ కూడా ఫుల్ చిలౌట్ అయ్యారు.

నాగ చైత‌న్య‌ని వివాహం చేసుకొని అక్కినేని కోడ‌లిగా మారిన స‌మంత ప్ర‌స్తుతం ఆహా అనే ప్లాట్‌ఫాం కోసం సామ్ జామ్ అనే షో చేస్తుంది. ఈ షోలో ఇండ‌స్ట్రీకి చెందిన ప‌లువురు స్టార్స్‌ని ఇంట‌ర్వ్యూ చేసి వారి నుండి ఆస‌క్తిక‌ర విష‌యాలు రాబ‌ట్టింది. ఇక ఈ సీజ‌న్ చివ‌రి ఎపిసోడ్ కోసం త‌న భ‌ర్త నాగచైత‌న్య‌ను తీసుకొచ్చింది.ఈ ఎపిసోడ్‌లో చైతూని సామ్ ప‌లు ఇంట్రెస్టింగ్ ప్ర‌శ్న‌లు అడిగి ఆడియ‌న్స్‌ను ఫుల్ ఎంట‌ర్‌టైన్ చేసింది. తాజాగా ఈ ఎపిసోడ్‌కు సంబంధించి ప్రోమో రిలీజ్ చేశారు.

ఇందులో స‌మంత ఫైన‌ల్‌గా సామ్ జామ్‌కు వ‌చ్చావు అని అనగా, అందుకు చైతూ.. వీడు ఎట్లాగు ఇంట్లోనే ప‌డి ఉంటాడు క‌దా, ఎప్పుడు పిలిచిన ఏ షోకు అయిన వ‌స్తాడు క‌దా అని లాస్ట్ కు పిలిచావు అని చైతూ అన‌డంతో న‌వ్వులు విరిసాయి. ఈ ప్రోమోని చూస్తుంటే షో మొత్తం ఫుల్ సంద‌డిగా ఉండ‌నున్న‌ట్టు తెలుస్తుంది. జ‌న‌వ‌రి 8న ఈ షో స్ట్రీమింగ్ కానుంది. గ‌తంలో వెండితెర‌పై సంద‌డి చేసి ఈ క్యూట్ క‌పుల్ ఇప్పుడు బుల్లితెర‌పై ఓ రేంజ్ వినోదం అందించ‌నున్న‌ట్టు తెలుస్తుంది.