మళ్ళీ విలన్ గా మారుతున్న స్టార్ హీరో

సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరో గా ఎదగాలంటే అంత ఈజీ కాదు. ఒకప్పుడు కృష్ణం రాజు, చిరంజీవి, ఆ తర్వాత శ్రీకాంత్, జేడీ చక్రవర్తి, రవి తేజ లాంటి చాలా మంది చిన్న చిన్న వేషాలు వేసుకుంటూ, ఆ తర్వాత విలన్స్ గా మెప్పించి హీరోలు అయ్యారు.

ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం విలన్ గా మెప్పించి ఇప్పుడు స్టార్ హీరో గా కొనసాగుతున్న రవి తేజ మరోసారి విలన్ గా మారుతున్నట్టు తెలుస్తుంది. శింబు హీరోగా ఎస్. జె. సూర్య కీలక పాత్రలో వెంకట్ ప్రభు తెరకెక్కించిన మూవీ `మానాడు`. ఈ సినిమా తెలుగు రైట్స్ ని రానా సొంతం చేసుకున్నాడు.

ఈ సినిమాని తెలుగు నేటివిటీ కి మార్చే బాధ్యతల్ని డైరెక్టర్ హరీష్ శంకర్ కు అప్పగించాడట. ఇప్పటికే పవన్ కళ్యాణ్ `భవదీయుడు భగత్ సింగ్` సినిమా గురించి ఎటూ తేలకపోవడంతో హరీష్ శంకర్ ఈ సినిమా డైరెక్ట్ చెయ్యడానికి ఒప్పుకున్నాడట.

శింబు రోల్ లో రానా నటిస్తుండగా ఎస్ జె సూర్య పాత్రలో ..రవితేజ ను అడుగుతున్నట్లు సమాచారం. అయితే ఇంకా రవి తేజ నుండి ఎలాంటి కన్ఫర్మేషన్ రాలేదని తెలుస్తుంది.