అవునా.! రష్మిక అలా తప్పించుకుంటోందా.?

టాలీవుడ్‌లో వన్ ఆఫ్ ది స్టార్ హీరోయిన్స్ లిస్టులో చేరిపోయింది ముద్దుగుమ్మ రష్మికా మండన్నా. ఇప్పటికే మహేష్ బాబు వంటి స్టార్ హీరోతో స్క్రీన్ షేర్ చేసుకుంది. లేటెస్టుగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన ‘పుష్ఫ’ సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ‘శ్రీ వల్లి’ అంటూ ఇటీవల రిలీజ్ చేసిన ఆమె క్యారెక్టర్ లుక్‌కీ మంచి రెస్సాన్స్ వచ్చింది.

అయితే, ఈ తరుణంలో రష్మిక మండన్నా గురించి ఓ ఘాటు గాసిప్ గుప్పుమంటోంది. తెలుగులో ఓ సినిమాకి సంబంధించి రష్మికా మండన్నా కాస్త లొల్లి పెడుతుందట. రెమ్యునరేషన్ బాగా పెంచేసి, తన కాల్ షీట్లు ఖాళీ లేవని చెబుతోందట.

అసలు విషయం ఏంటంటే, రష్మికా మండన్నాకి బాలీవుడ్ నుండి క్రేజీ ఆఫర్లు వస్తున్నాయ్. ఇప్పటికే రెండు ప్రాజెక్టులు ఓకే చేసింది. మరిన్ని ప్రాజెక్టులు రష్మిక కోసం రెడీగా ఉన్నాయట. అదే సమయంలో కోలీవుడ్ నుండీ మంచి ఆఫర్లు వస్తున్నాయట. దాంతో తెలుగులో సినిమాలు తగ్గించేద్దామనుకుంటోందట. అందుకే ఇలా రెమ్యునరేషన్ వంక పెట్టి సైడ్ ట్రాక్ వేస్తోందని అంటున్నారు.

అయితే, తెలుగులో రష్మిక మండన్నాఆల్రెడీ విపరీతమైన క్రేజ్ దక్కించుకుంది. ఇంకా మరిన్ని నయా ప్రాజెక్టులు రష్మక కోసం ఇక్కడే క్యూ కట్టనున్నాయి. ఇలాంటి తరుణంలో రష్మిక ఈ నిర్ణయం తీసుకోవడం మంచిది కాదంటూ ఆమె సన్నిహితులు, అభిమానులు సలహాలిస్తున్నారట. అయితే, రష్మికను అంత తేలిగ్గా అంచనా వేయడానికి లేదు. చాలా తెలివైంది. తెలివిగానే డెసిషన్స్ తీసుకుంటుంది. మరి ఈ గాలి వార్తల్లో నిజమెంతో రష్మికకే తెలియాలి.