Acharya: తనకిష్టమైన సన్నివేశం ఏంటో చెప్పేసిన రామ్ చరణ్!

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, చిరంజీవి మల్టీస్టారర్ చిత్రంగా తెరకెక్కిన సినిమా ఆచార్య. ఈ సినిమా ఈనెల 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున సినిమా ప్రమోషనల్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి విలేకరుల నుంచి ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురయింది. ఈ సినిమాలో మీకు ఎంతో ఇష్టమైన సన్నివేశం ఏంటి అని ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు రామ్ చరణ్ సమాధానం చెబుతూ ఆచార్య సినిమాలు తనకు ఇష్టమైన సన్నివేశం గురించి మాట్లాడుతూ… సినిమాలు ఒక నది ఒడ్డున చరణ్ నీళ్లు తాగుతూ ఉంటాడు.. ఆ సమయంలో చిరంజీవి తన వెనకాలే ఉంటాడు. అలాగే ఆ నదికి అటువైపు చిరుత పిల్ల నీళ్లు తాగుతూ ఉండగా తన తల్లి తన పక్కనే నిలబడి ఉంటుంది. ఈ సీన్ తనకు ఎంతగానో ఇష్టమని రామ్ చరణ్ ఈ సందర్భంగా ఈ సినిమాలో తనకు ఎంతో ఇష్టమైన సన్నివేశం గురించి వెల్లడించారు.

ఇక ఆచార్య సినిమా నుంచి ఈ సినిమా విడుదల అయినప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతూ మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా విడుదల తేది దగ్గర పడుతున్న సమయంలో చరణ్ కూడా తనకు ఈ సన్నివేశమే ఇష్టమని తెలియజేయడం విశేషం.29వ తేదీ రాబోతున్న ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను చేరుకుంటుందా? లేదా? అనే విషయం తెలియాల్సి ఉంది.