రామ్ చరణ్ మరో సెన్సేషనల్ ప్రాజెక్ట్ కన్ఫర్మ్..కానీ కంగారులో ఫ్యాన్స్

ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ప్రభాస్ తర్వాత పాన్ ఇండియన్ మార్కెట్ లో త్వరగా సెటిల్ అయ్యే హీరోలా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కనిపిస్తున్నాడు. తాను నటించిన భారీ పాన్ ఇండియన్ సినిమా ‘RRR’ తర్వాత తీసుకుంటున్న సినిమాలు తన స్టార్డం ని పెంచే విధంగానే వెళ్తున్నాయి. అయితే ఇప్పుడు ఇండియన్ ఐకానిక్ దర్శకుడు శంకర్ తో ఓ సినిమా చేస్తుండగా ఈరోజు దసరా పండుగ కానుకగా టాలీవుడ్ యంగ్ దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో మరో సెన్సేషనల్ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేసేసాడు.

గత కొంత కాలం నుంచి ఈ ఇద్దరి నుంచి సినిమా ఉంటుంది అనే టాక్ నిజం చేస్తూ ఈరోజు అధికారిక క్లారిటీ వచ్చింది. సరే ఇది పక్కన పెడితే ‘జెర్సీ’, ‘మళ్ళీ రావా’ లాంటి ఫీల్ గుడ్ సినిమాలు ఇచ్చిన డైరెక్టర్ తో సినిమా అని ఆనందపడాలా లేక సినిమా నిర్మాణ సంస్థ చూసి బాధపడాలా అనే పరిస్థితిలో ఇప్పుడు చరణ్ అభిమానులు ఉన్నారు.

ఎందుకంటే ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు. ఇక వీరి నుంచి సినిమా అంటే అప్డేట్స్ పరంగా ఎంత లేట్ గా ఉంటారో తెలిసిందే. దీనితో అభిమానులకు ఎదురు చూపులు తప్పవు ఇప్పుడు ఆల్రెడీ రాధే శ్యామ్ కి ప్రభాస్ అభిమానులు కూడా అలాగే ఉన్నారు. ఇక చరణ్ సినిమాకి ఎలా చేస్తారో చూడాలి.