Ram Charan: చిరంజీవికి కరోనా.. అతిథిగా హాజరు కానున్న చెర్రీ..?

Ram Charan: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అయితే మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తెలుగు సిని పరిశ్రమకు పెద్దగా వ్యవహరిస్తున్న విషయం అందరికి తెలిసిందే. అయితే సినీ ఇండస్ట్రీకి చిరంజీవి పెద్దగా ఉండను అని చెప్పినప్పటికీ సినీ ఇండస్ట్రీ వారికి కష్టాలలో తన అండదండలు అందిస్తూనే ఉంటారు. ఇకపోతే కీర్తి సురేష్ నటించిన గుడ్ లఖ్ సఖి సినిమాకు చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరు కావాల్సి ఉంది. కానీ చిరంజీవి కి కరోనా సోకడంతో పరిస్థితులు మొత్తం తారుమారు అయ్యాయి. చిరంజీవి కరోనా సోకిన విషయాన్ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు.

అయితే తనకు తేలికపాటి లక్షణాలు ఉండటంతో తాజాగా పరీక్ష చేయించుకున్నాను అని, ఈ క్రమంలోనే పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది అని చిరంజీవి తన ట్వీట్ లో చెప్పుకొచ్చారు. అదే విధంగా ప్రస్తుతం హోమ్ క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నానని, అదేవిధంగా ఇటీవల తనను కలిసిన వారందరూ కూడా వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోవాలి అని మెగాస్టార్ సూచించారు. ఇక త్వరలో కోలుకునే అందరి ముందుకు వస్తాను అంటూ చిరంజీవి ఈ సందర్భంగా ట్వీట్ చేశారు. ఇకపోతే కీర్తి సురేష్ నటించిన గుడ్ లఖ్ సఖి ప్లీజ్ రిలీజ్ ఈవెంట్ ను తాజాగా నిర్వహించారు.

ఇక ఆ ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా రావాల్సి ఉండగా, ఆయన కరోనా బారిన పడటంతో ఆ చిత్ర బృందం వారు అయోమయంలోకి వెళ్లారు. ఇక వెంటనే చీఫ్ గెస్ట్ గా ఆ ఈ కార్యక్రమానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ను ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు అందుకు సంబంధించిన పోస్టర్ లు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక గుడ్ లఖ్ సఖి సినిమాలో కీర్తి సురేష్ షూటర్ గా కనిపించనుంది. ఇందులో ఆది పినిశెట్టి, జగపతి బాబు ముఖ్య పాత్రల్లో నటించారు. ఇక ఈ సినిమాను ప్రొడ్యూసర్ దిల్ రాజు సమర్పణలో వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్ బ్యానర్ పై సుధీర్ చంద్ర పదిరి ఈ సినిమాను నిర్మించారు.