తమ బయ్యర్ల కోసం ఒక తాటి మీదకు రాబోతున్న చిరు, చరణ్ లు..?

Acharya Buyers

Acharya Buyers : ఈ ఏడాది టాలీవుడ్ లో ఎన్ని అంచనాలు నెలకొల్పుకొని రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో మెగా మల్టీ స్టారర్ “ఆచార్య” కూడా ఒకటి. మెగాస్టార్ చిరంజీవి మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లతో దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ దారుణ పరాజయాన్ని బాక్సాఫీస్ దగ్గర చూడాల్సి వచ్చింది.

దీనితో ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాని కొనుగోలు చేసిన బయ్యర్లు దాదాపు 50 శాతానికి పైగా నష్టాలు చూడక తప్పలేదు. అయితే ఈ సినిమా రిలీజ్ అయ్యాక కొంతమంది అయితే ఏకంగా డైరెక్ట్ గా చిరంజీవికే లెటర్ పంపారు. అవి పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి.

మరి దీనితో ఈ సినిమా హీరో మరియు నిర్మాతలు అయిన మెగాస్టార్ చిరంజీవి మరియు రామ్ చరణ్ లు తమ బయ్యర్ల కోసం ఒక తాటిపైకి వస్తున్నట్టుగా సినీ వర్గాలు చెబుతున్నాయి. రీసెంట్ గా వారిని పిలిపించి వారితో మాట్లాడి వచ్చిన నష్టాలపై ఒక సెటిల్మెంట్ ని చేస్తున్నారని..

కొంత మొత్తంతో తిరిగి ఇవ్వడమో లేక తర్వాత సినిమాల హక్కులు ఇవ్వడమో లాంటి డీల్ తో సెట్ చేస్తున్నారట. మొత్తానికి అయితే ఈ సినిమా ఇండస్ట్రీలోనే ఒక పెద్ద డిజాస్టర్ట్ గా నిలిచింది. ఇంకా ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా మణిశర్మ సంగీతం అందించారు.