M.M.Sreelekha: రాజమౌళి మహేష్ సినిమా గురించి అప్డేట్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ శ్రీలేఖ?

M.M.Sreelekha: టాలీవుడ్ లేడీ మ్యూజిక్ డైరెక్టర్ శ్రీలేఖ గురించి మనకు తెలిసిందే. ఈమె వరుసకు రాజమౌళికి సోదరి అవుతుందన్న సంగతి మనకు తెలుసు. ఇదిలా ఉండగా రాజమౌళి ఎన్టీఆర్ రామ్ చరణ్ లతో త్రిబుల్ ఆర్ సినిమాని తెరకెక్కించిన సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా ఎన్నో సార్లు వాయిదా పడి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యింది. ఈ సినిమా తర్వాత రాజమౌళి తన తదుపరి ప్రాజెక్టు పై పూర్తి దృష్టి పెట్టనున్నట్లు సమాచారం. రాజమౌళి తన తదుపరి చిత్రాన్ని మహేష్ బాబు దర్శకత్వంలో చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే ఈ సినిమా కథను రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ సిద్ధం చేస్తున్నారు. ఆఫ్రికా అడవుల్లో నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతోందని ఇప్పటికే కాస్త క్లూ ఇచ్చారు. అయితే ఇంకా స్క్రిప్ట్ పనులు పూర్తి కాలేదని తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఎం.ఎం.శ్రీలేఖ విజయేంద్ర ప్రసాద్ తో కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఫోటో ద్వారా రాజమౌళి మహేష్ సినిమా గురించి ఏదైనా అప్ డేట్ ఇచ్చారా అంటూ అభిప్రాయపడుతున్నారు.

ఈ ఫోటోని శ్రీలేఖ సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ అవుతుంది. ఇందులో విజయేంద్రప్రసాద్ కథ రాస్తూ ఉండగా టేబుల్ పై కరెన్సీ నోట్లు ఉండడంతో వీటి ద్వారా ఈ సినిమాకు సంబంధించి ఏదైనా అప్డేట్ ఇవ్వబోతున్నారా అంటూ పెద్దఎత్తున సందేహాలను వ్యక్తపరుస్తున్నారు. అయితే ఈ సినిమా కథ ఎలా ఉండబోతోంది ఏంటి అనే విషయాల గురించి త్వరలోనే ప్రకటించనున్నట్లు సమాచారం.ఇకపోతే ఈ సినిమాలో మహేష్ బాబుతో పోటీ పడటం కోసం టాలీవుడ్ హీరో గోపీచంద్, కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ పేర్లు బలంగా వినబడుతున్నాయి. మరి వీటిలో ఎంత వరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.