S.S Rajamouli: రణ్ బీర్ కపూర్, ఆలియా భట్, ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన బాలీవుడ్ చిత్రం బ్రహ్మాస్త్ర. ఈ సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించగా, కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు.ఈ సినిమాను తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగా ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్ సౌత్ లో తాజాగా అద్భుతంగా మొదలయ్యింది. ఇదిలా ఉంటే ఈ సినిమాను సౌత్ వర్సెస్ ప్రజెంట్ చేయడానికి దర్శకధీరుడు రాజమౌళి హాజరయ్యారు.
బాలీవుడ్ లో తెరకెక్కుతున్న బాలీవుడ్ చిత్రం బ్రహ్మస్త్ర ప్రెస్ మీట్ తాజాగా హైదరాబాదులో జరిగింది. ఈ సందర్భంగా దర్శక ధీరుడు రాజమౌళి మాట్లాడుతూ.. వీడెవడో నాకన్నా పిచ్చోడు అనుకున్న అంటూ బ్రహ్మాస్త్ర మూవీ డైరెక్టర్ పై కామెంట్స్ చేశారు. ఈ సినిమా గురించి అయాన్ రాజమౌళి ని కలిసి మూడేళ్లు అవుతోందట. ఒకరోజు కరణ్ జోహార్ రాజమౌళికి ఫోన్ చేసి బ్రహ్మాస్త్ర అనే సినిమాను చేస్తున్నాము, అందుకోసం డైరెక్టర్ అయాన్ మిమ్మల్ని కలుస్తారు అని చెప్పారు, చెప్పిన విధంగానే దర్శకుడు వచ్చి నన్ను కలిశాడు. అప్పుడు ఆ సినిమా గురించి నాకు 20 నిమిషాలు చెప్పగానే వీడెవడో నాకన్న పిచ్చోడు అని అనుకున్నాను అని తెలిపాడు రాజమౌళి.
కానీ దర్శకుడు అయాన్ మాత్రం సినిమాల విషయంలో చాలా సీరియస్ గా ఉన్నాడు. ఒక్క సినిమా గురించి చాలా టైమ్ స్పెండ్ చేశారు. నాకు సినిమాల విషయంలో ఎంత పిచ్చి ఉందో అంతకంటే ఎక్కువగా అయాన్ కు ఉందని తెలిపారు రాజమౌళి. ఇక దర్శకుడు ఆ సినిమా కథ చెప్తుంటే ఒక బ్రహ్మాండం సృష్టిస్తున్నాడు అనిపించింది. అందువల్ల ఈ సినిమా టీం అసోసియేట్ అవ్వాలని డిసైడ్ అయ్యాను అంటూ రాజమౌళి చెప్పుకొచ్చారు. అంతే కాకుండా ఈ సినిమా నాకు బాహుబలి సినిమాని గుర్తు చేస్తోంది. సినిమా పై ప్రేమ, ఫ్యాషన్,పిచ్చి ఉన్న వాళ్లకే ఇలాంటివి సాధ్యమవుతాయి అని తెలిపారు.ఈ సినిమాలో అలియా భట్, రణబీర్ కపూర్, అమితాబచ్చన్ ప్రధాన పాత్రలో నటించిన విషయం తెలిసిందే. అంతే కాకుండా అక్కినేని నాగార్జున, డింపుల్ కపాడియా, మౌని రాయ్ కూడా కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది.
