మహేష్ బాబు తో పూరి పోకిరి, బిజినెస్ మ్యాన్ సీక్వెల్స్?

టాలీవుడ్ లో సంచలన దర్శకుల్లో పూరి జగన్నాధ్ ఒకరు. ‘బద్రి’, ‘ఇడియట్’ లాంటి ఎన్నో సూపర్ హిట్స్ ఇచ్చిన పూరి జగన్నాధ్ కెరీర్ లో ‘పోకిరి’ అతి పెద్ద హిట్. అప్పటివరకు చిరంజీవి ‘ఇంద్ర’ పేరున ఉన్న అన్ని రికార్డ్స్ ని బ్రేక్ చేసి సరికొత్త రికార్డ్స్ సృష్టించింది ఈ సినిమా. ఈ సినిమాతో మహేష్ బాబు స్టార్ డమ్ అమాంతం పెరిగిపోయింది.

వీళ్లిద్దరి కాంబినేషన్ లో ‘బిజినెస్ మ్యాన్’ సినిమా కూడా పెద్ద విజయం సాధించింది. అయితే ఆ తర్వాత పూరి, మహేష్ కలిసి పని చెయ్యలేదు. ఇద్దరి మధ్య ఏవో మనస్పర్థలు వచ్చాయని వార్తలు కూడా వచ్చాయి. పూరి జగన్నాధ్ తన డ్రీం ప్రాజెక్ట్ ‘జనగణమన’ మహేష్ బాబు తో చెయ్యాలనుకున్నాడు, కానీ ఇద్దరి మధ్య రిలేషన్స్ అంత బాగా లేకపోవడంతో విజయ్ దేవరకొండ తో ఈ సినిమాను స్టార్ట్ చేసాడు.

ఈ మధ్యే ‘పోకిరి’ రీ-రిలీజ్ లో కూడా మంచి కలెక్షన్స్ సాధించింది. అయితే మహేష్ బాబు అభిమానులు ‘పోకిరి’, ‘బిజినెస్ మ్యాన్’ సినిమాలకు సీక్వెల్స్ వస్తే బాగుంటుంది అని కోరుకుంటున్నారు. అలానే గతంలో పోకిరి, బిజినెస్ మ్యాన్ మూవీస్ కి సీక్వెల్స్ చేద్దాం అని నేను, మహేష్ గారు భావించాము అయితే అప్పటి పరిస్థితులు అలానే ఇద్దరి నెక్స్ట్ కమిట్మెంట్స్ కారణంగా అది కుదరలేదన్నారు పూరి జగన్నాధ్.

అలాగే తనకు పండుగాడు, సూర్య భాయ్ రెండు క్యారెక్టర్స్ అంటే చాలా ఇష్టం, మరీ ముఖ్యంగా అవి ఆడియన్స్ నుండి ఎంతో సూపర్ క్రేజ్ అందుకున్నాయని, అందుకే అన్ని కలిసి వస్తే తప్పకుండా పోకిరి, తో పాటు బిజినెస్ మ్యాన్ మూవీస్ రెండిటికీ త్వరలో ఫ్రాంచైజ్ సీక్వెల్స్ తెలుగులో మహేష్ తోనే చేసే ఆలోచన కూడా ఉందని పూరి జగన్నాధ్అ అన్నారు. యితే అవి ఎప్పుడు జరుగుతాయి అనేది చెప్పడానికి మరికొంత సమయం పడుతుందని తన మనసులో మాట బయటపెట్టారు పూరి జగన్నాథ్.

ప్రస్తుతం విజయ్ దేవరకొండతో తీసిన ‘లైగర్’ మూవీ ప్రమోషన్స్ తో బిజీ గా ఉన్నారు పూరి జగన్నాధ్. ఒక ఇంగ్లీష్ పత్రికకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో భాగంగా ఈ రెండు సినిమాల గురించి కొన్ని అప్ డేట్స్ ఇచ్చారు పూరి జగన్నాథ్. ఆయన మాట్లాడుతూ తనకు బిజినెస్ మ్యాన్ మూవీని త్వరలో హిందీ లో రీమేక్ చేసే ఆలోచన ఉందని, దీని గురించిన పూర్తి వివరాలు త్వరలో తెలియచేస్తానని అన్నారు పూరి జగన్నాధ్.