ఆ హీరో తో పూరి బిజినెస్ మ్యాన్ రీమేక్?

పూరి జగన్నాధ్ కెరీర్ లో ఎన్నో ఆటు పోట్లు. ఇండస్ట్రీ హిట్ లాంటి సూపర్ హిట్స్ ఇచ్చిన పూరి జగన్నాధ్ అత్యంత ఘోరమైన ప్లాప్స్ కూడా ఇచ్చాడు. ఈ రోజు రిలీజ్ అయిన ‘లైగర్’ సినిమా మీదే పూరి తన ఆశలన్నీ పెట్టుకున్నాడు.

తన కెరీర్ లోనే బెస్ట్ సినిమాల్లో ఒకటి ‘బిజినెస్ మ్యాన్’. 2012లో విడుదలైన ఈ సినిమా లో మహేష్ బాబు, కాజల్ అగర్వాల్,  ప్రకాష్ రాజ్, నాజర్ కూడా ముఖ్యపాత్రలో నటించారు. ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదలై ఊహించని బ్లాక్ బస్టర్ హిట్ ను అందించింది.

ఇప్పుడు తాజాగా హిందీలో రీమేక్ చేయాలి అని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తో ఈ సినిమాను బాలీవుడ్ లో చెయ్యాలని చూస్తున్నట్టు తెలుస్తుంది.

అయితే ఇంతకుముందే వి వి వినాయక్ ‘ఛత్రపతి’ ని హిందీ లో ఇదే హీరో తో రీమేక్ చేస్తున్నట్టు ప్రకటించారు. కానీ ఆ తర్వాత ఆ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ రాలేదు. మరి పూరి అయినా బెల్లంకొండను హిందీ చిత్ర పరిశ్రమకు పరిచయం చేస్తాడో లేదో చూడాలి.