సోషల్ డిస్టెన్స్ పాటించలేకపోతున్న హీరో హీరోయిన్ !

Pooja Hegde

కోవిద్-19 ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. కొన్ని నెలల పాటు అన్ని దేశాలు లాక్ డౌన్ పాటించాయి. రోజువారి పనులన్నీ, అవి ఎంత ముఖ్యమైన రద్దు చేసుకొని ఇంట్లో కూర్చొనే పరిస్థితి కల్పించింది. అయితే లాక్ డౌన్ తీవ్ర ఆర్థిక సంక్షోభానికి దారి తీస్తుందని అనేక దేశాలు మెల్లిగా లాక్ డౌన్ రూల్స్ ని సడలించడం మొదలుపెట్టాయి. రూల్స్ ఎంత సడలించినా సోషల్ డిస్టెన్స్, అదే మనిషికి మనిషికి మధ్య ఆరు అడుగుల దూరం విధిగా పాటించాలని ప్రభుత్వాలు, WHO లాంటి సంస్థలు చెబుతున్నాయి.

అన్ని రంగాల్లో లాగానే సినీ పరిశ్రమ కూడా మన తెలుగు రాష్ట్రాల్లో సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ షూటింగ్ జరుపుకోవచ్చని అనుమతులు ఇచ్చారు. సినిమా షూటింగ్ లో అందరూ సోషల్ డిస్టెన్స్ పాటించవచ్చు. కానీ హీరో హీరోయిన్ మధ్య సోషల్ డిస్టెన్స్ పాటించి సినిమా చేస్తే అది ప్రేక్షకులని మెప్పించ లేదు. అయితే సోషల్ డిస్టెన్స్ పాటించకపోతే కరోనా భారిన పడే అవకాశం కూడా ఉంది.

ఇటువంటి చిక్కే మన తెలుగు పరిశ్రమలో ఒక హీరో హీరోయిన్ కి ఎదురైంది. ఆ జంట ఎవరో కాదు అక్కినేని అఖిల్, పూజా హెగ్డే. వీరిద్దరూ కలిసి నటిస్తున్న చిత్రం “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్”. ఆ చిత్రం షూటింగ్ ఈ మధ్యనే లాక్ డౌన్ తర్వాత ప్రారంభమైంది ఈ సందర్భాన్ని తెలియజేస్తూ పూజా హెగ్డే తన ఇంస్టాగ్రామ్ లో ఒక ఫోటో షేర్ చేసింది. సెట్లో అందరూ సోషల్ డిస్టెన్స్ పాటించినప్పటికీ మేమిద్దరం సోషల్ డిస్టెన్స్ పాటించలేక పోతున్నాము అంటూ ఆ ఫోటో షేర్ చేసింది.

నిర్మాత బాగు కోరి ఆరోగ్యాన్ని రిస్క్ చేసి సినిమా చేస్తున్న హీరో హీరోయిన్లు అభినందనీయులు.
యూనిట్ తగు జాగ్రత్తలు తీసుకొని వీరిద్దరూ ఆరోగ్యంగా ఉండాలని సినిమా మంచి సక్సెస్ సాధించాలని తెలుగు రాజ్యం కోరుకుంటుంది.