మహేష్ బాబు ‘పార్థు’ కథ

Parthu will be the Mahesh Babu, Trivikram movie title

Parthu will be the Mahesh Babu, Trivikram movie title

సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో కొత్త సినిమా ప్రకటితమైన సంగతి తెలిసిందే. దాదాపు 10 ఏళ్ల తర్వాత మహేష్, త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించనుండటం వలన ప్రాజెక్ట్ మీద భారీ హైప్ నెలకొంది. గతంలో వీరి కలయికలో ‘అతడు, ఖలేజా’ లాంటి సినిమాలు వచ్చాయి. ఆ రెండూ బాక్సాఫీస్ వద్ద హిట్ కాలేదు కానీ ప్రేక్షకుల మన్నన్నలు అయితే పొందగలిగాయి. వీరి కలయిక మీద ప్రత్యేకమైన క్రేజ్ ఏర్పడేలా చేశాయి ఆ రెండు చిత్రాలు.

ఇప్పుడు మహేష్ బాబు కోసం త్రివిక్రమ్ రాస్తున్న కథ గత సినిమాల కథల కంటే బాగుంటుందట. పైగా సినిమాకు ‘పార్థు’ అనే టైటిల్ అనుకుంటున్నారట. పార్థు అనే పేరుకు ఒక ఇమేజ్ ఉంది. ‘అతడు’ చిత్రంలో మహేష్ బాబు పాత్ర పేరు పార్ధునే. ఆ పాత్రను, అందులో మహేష్ బాబు నటన, డైలాగ్స్, ఫైట్స్ ఎప్పటికీ క్రేజీగానే ఉంటాయి. అందుకే మహేష్ కెరీర్లో పార్థు పాత్రకు అంత ప్రత్యేకత. ఇప్పుడు అదే పేరును త్రివిక్రమ్ మహేష్ సినిమాకు పెట్టనున్నారనే వార్తలు వస్తుండటంతో మహేష్ అభిమానుల్లో అమితాసక్తి నెలకొంది.