విడాకులకు సిద్ధమైన మరో హీరోయిన్

ఈ మధ్య ఫిలిం ఇండస్ట్రీ లో విడాకులు అనేది సర్వ సాధారణమైపోయింది. పెళ్లి చేసుకున్న కొన్నాళ్ళకి విడాకులు తీసుకుంటున్నారు. ఆ మధ్య అమల పాల్, తర్వాత సమంత…ఇప్పుడు తాజాగా ఆ లిస్ట్ లోకి ప్రియమణి కూడా చేరబోతుందని వినికిడి.

హీరోయిన్ గా ఫేడ్ అవుట్ అయ్యాక  ప్రియమణి 2017 లో ముస్తఫారాజ్ అనే వ్యాపార‌వేత్త‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే అప్పటికే ముస్తఫా రాజ్ కు పెళ్లై విడాకులు కూడా అయ్యాయి.

వీళ్ళ పెళ్లి టైం లో ముస్తఫా రాజ్ భార్య ప్రియ‌మ‌ణి పై ఆరోపణలు సైతం చేసింది. కానీ ప్రియమణి వాటిని లైట్ తీసుకుని ముస్తఫా తో వివాహ బంధం లోకి అడుగుపెట్టింది. కానీ ఈ మధ్య ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయంట. కొంతకాలంగా వీరిద్ద‌రూ వేరువేరుగా ఉంటున్నట్టు సమాచారం. దీని పై ప్రియమణి ఇంకా స్పందించలేదు.