చిరు సినిమాలో గొడవలు.. నిజమెంత ?

No disputes between Chiranjeevi, Mohan raja
No disputes between Chiranjeevi, Mohan raja
 
మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలను లైన్లో పెట్టుకున్న సంగతి తెలిసిందే.  ‘ఆచార్య’ కాకుండా ఇంకో మూడు సినిమాలకు చిరు సైన్ చేసి ఉన్నారు.  వీటిలో ముందుగా ‘లూసిఫర్’ తెలుగు రీమేక్ చేయాల్సి ఉంది.  ఈ సినిమా దర్శకుడి విషయంలో మొదటి నుండి కన్ఫ్యూజన్ నడుస్తూనే ఉంది. మొదట వినాయక్ డైరెక్ట్ చేస్తాడని అనుకోగా ఆతర్వాత ఆయన తప్పుకుని మోహన్ రాజా లైన్లోకి రావడం జరిగింది.  చిరు కూడ మోహన్ రాజా పేరును అధికారికంగా ప్రకటించేశారు. అనుకున్నట్టే జరిగి ఉంటే ఈపాటికే సినిమా మొదలుకావాల్సింది.  కానీ లాక్ డౌన్ కారణంగా ఆలస్యమవుతోంది.  
 
ఈ ఆలస్యంలోనే సినిమా దర్శకుడి విషయంలో పుకార్లు మొదలయ్యాయి.  డైరెక్టర్ మోహన్ రాజా సినిమా నుండి తప్పుకున్నట్టు వార్తలు పుట్టుకొచ్చాయి.  ఒరిజినల్ స్క్రిప్ట్లో మార్పులు చేసే విషయమై నిర్మాతలతో క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చి మోహన్ రాజా పక్కకు తప్పుకున్నారని, చిరు బృందం వేరొక దర్శకుడిని వెతుక్కునే పనిలో ఉన్నారని అన్నారు.  కానీ ఆరాతీస్తే అలాంటిదేమీ లేదని రూఢీ అయింది.  దర్శకుడి వైపు నుండి ఎలాంటి సమస్య లేదని, మోహన్ రాజా పక్కాగా స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారని, ‘ఆచార్య’ పూర్తవగానే వీరి ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందని తెలుస్తోంది.