అనుష్క “నిశ్శబ్దం” సినిమా ఓ కేబుల్ ఛానల్ లో పైరసీ ప్రసారం:రూ.1.1 కోట్లు డిమాండ్ చేస్తున్న నిర్మాతలు

nishabdham makers demands 1.1.1cr rs. from a cable channel for damage

అనుష్క శెట్టి, మాధవన్, సుబ్బరాజు, షాలిని పాండే, అంజలి ప్రధాన పాత్రలగా పోషించిన మిస్టరీ థ్రిల్లర్ ‘నిశ్శబ్దం’. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను అక్టోబర్ 2న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేశారు. అయితే, ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. విమర్శకులైతే తక్కువ మార్కులే వేశారు. సినిమా సంగతి ఎలా ఉన్నా అనుష్క నటనను మాత్రం అంతా కొనియాడారు.

nishabdham makers demands 1.1.1cr rs. from a cable channel for damage
nishabdham makers demands 1.1.1cr rs. from a cable channel for damage

సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినా చిత్ర యూనిట్ అయితే ‘నిశ్శబ్దం’ను ఇంకా ప్రమోట్ చేస్తూనే ఉంది. సినిమాను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్తోన్న ఈ సమయంలో చిత్ర నిర్మాతలకు అనుకోని షాక్ తగిలిందట. ఈ సినిమా అమెజాన్ లో విడుదలైన కొన్ని గంటల్లోనే ఓ కేబుల్ ఛానల్ ప్రసారం చేసేసిందని సమాచారం. ఈ విషయం నిర్మాతల దృష్టికి వెళ్లింది. ఆ కేబుల్ ఛానల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన నిర్మాతలు.. వారికి లీగల్ నోటీస్ పంపినట్టు సమాచారం.

poster from nishabdham movie
poster from nishabdham movie

ప్రస్తుతం ఇండస్ట్రీ నుంచి వస్తోన్న సమాచారం ప్రకారం ఆ కేబుల్ ఛానల్‌ను డ్యామేజ్ ఛార్జెస్ కింద నిర్మాతలు రూ.1.1 కోట్లు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు, అమెజాన్ ప్రైమ్ సైతం మరో రూ.30 లక్షలు డిమాండ్ చేస్తుందట. ఈ మేరకు ఓ వెబ్‌సైట్ కథనాన్ని ప్రచురించగా.. దాన్ని దర్శకుడు హేమంత్ మధుకర్ రీట్వీట్ చేశారు. అంటే, ఈ వార్తలో కచ్చితంగా నిజం ఉంది. మరి ఇంత మొత్తాన్ని ఆ కేబుల్ ఛానల్ కడుతుందో లేదంటే చట్టపరమైన చర్యలకు ఉపక్రమిస్తుందో చూడాలి. ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్, కోన వెంకట్ సంయుక్తంగా నిర్మించారు.