Samantha : సమంత ప్రధాన పాత్రలో న్యూ ఏజ్ థ్రిల్లర్.!

Samantha :  సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా వుంది. ‘శాకుంతలం’ ఇంకా విడుదల కావాల్సి వుంది. ‘యశోద’ తదితర ప్రాజెక్టులతో సమంత క్షణం తీరిక లేకుండా వుంది. చెన్నయ్, హైద్రాబాద్ ముంబై మధ్య షటిల్ సర్వీస్ కూడా చేయాల్సి వస్తోంది సమంతకి. కెరీర్‌లో ఎప్పుడూ లేనంత బిజీగా వుందిప్పుడు సమంత.

ఫలానా బాలీవుడ్ సినిమాలో సమంత హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసింది.. ఫలానా కోలీవుడ్ హీరో సరసన సమంత సినిమా చేయబోతోంది.. అంటూ రకరకాల ఊహాగానాలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి.. అదే సమయంలో సమంత మంచి మంచి అవకాశాల్ని సొంతం చేసుకుంటోంది కూడా.

సినిమాలే కాదు, ఆయా ప్రోడక్టులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా మారిపోయింది సమత. అలా సమంత రెండు చేతులా సంపాదించేస్తోంది. ఆర్జన పరంగా చూసుకుంటే, గతంలో ఎన్నడూ లేనంత కలర్‌ఫుల్‌గా ఆమె లైఫ్ వుందట ఇప్పుడు. హీరోయిన్‌గా ఆమె డిమాండ్ ఇప్పుడు దాదాపు మూడు కోట్లు వుందని చెబుతున్నారు సినీ పరిశ్రమలో.

ఇదిలా వుంటే, సమంత ప్రధాన పాత్రలో ఓ న్యూ ఏజ్ థ్రిల్లర్ తెరకెక్కించడానికి టాలీవుడ్‌లో ఓ ప్రముఖ దర్శకుడు ప్రయత్నిస్తున్నాడట. ఈ సినిమాలో ఇతర ప్రధాన పాత్రల కోసం బాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు.. పలువురు ప్రముఖ నటుల్ని తీసుకోబోతున్నారట.. అవి జస్ట్ అతిథి పాత్రల్లాంటివేనని సమాచారం.

యాక్షన్ థ్రిల్లర్‌లా ఈ సినిమా వుండబోతోందనీ, ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సినిమాలో సమంత చేసిన యాక్షన్ బ్లాక్స్ కంటే కూడా టెర్రిఫిక్‌గా వుంటాయని తెలుస్తోంది. పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి వుంది.