Nayanthara : సరోగసీ క్లబ్బులో నయనతార: తల్లి కాబోతోందట నిజమేనా.?

Nayanthara : సరోగసీ.. అదేనండీ అద్డె గర్బం. సెలబ్రిటీలు చాలా మంది ఈ అద్డె గర్భం ద్వారా తల్లి తండ్రులవుతుంటారు. సన్నీలియోన్, షారూఖ్ ఖాన్.. ఇలా చాలా మందే సరోగసీ విధానం ద్వారా పేరెంట్స్ అయిన వాళ్లున్నారు. నిజానికి ఈ లిస్టు తీయాలంటే చాలా పెద్దదే.

అయితే, ఈ లిస్టులోకి లేటెస్టుగా తానూ చేరతానంటోంది సౌత్ క్వీన్ నయనతార. అవునండీ నయనతార కూడా సరోగసీ విధానం ద్వారా తల్లి కావాలనుకుంటోందట. తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో లివింగ్ రిలేషన్ షిప్‌లో వున్న నయనతార పెళ్లి విషయాన్ని మాత్రం ఎప్పుడూ దాచిపెట్టేస్తూనే వుంటుంది.

దాగుడుమూతలు దండాకోర్.. అన్నట్లుగా అదిగో నయన్ పెళ్లయిపోయిందట. ఇదిగో ప్రూఫ్ అంటూ మీడియా జనాలు ఎన్ని ప్రూఫ్‌లు చూపించినా ఆ ఒక్కటీ కాలేదంతే.. అంటూ గజిబిజి గందరగోళంలోకి నెట్టేస్తూ వుంటారీ ప్రేమ జంట ఎప్పటికప్పుడే.

ఇంతవరకూ వీరి పెళ్లి ముచ్చటే హాట్ టాపిక్ అంటే, తాజాగా ఇదిగో ఈ కొత్త ముచ్చట తెరపైకి వచ్చింది. త్వరలోనే సరోగసీ విధానం ద్వారా నయనతార, విఘ్నేష్ శివన్ దంపతులు తల్లి తండ్రులు కాబోతున్నారట. సహజీవనం ద్వారా జంట జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్ననయనతార అమ్మతనంలోని తీపిని కూడా ఆస్వాదించాలనుకుంటోందట.

కానీ, డైరెక్టుగా కాకుండా ఇలా సరోగసీ పద్ధతిని అనుసరించాలనుకుంటోందట. అయితే, ఇది ఉత్త గాచిప్‌నేనా.? లేక నిజంగానే నయన్ తల్లి కాబోతోందా.? చూడాలి మరి. ఇక  ప్రస్తుతం నయన్ పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులు ఇటు తెలుగులోనూ, అటు తమిళంలోనూ చాలానే వున్నాయ్.