తిరుపతిలో పెళ్లి చేసుకోకపోవడానికి కారణం అదే.. అసలు విషయం చెప్పిన నయన్ విగ్నేష్?

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతున్న నయనతార ఎట్టకేలకు తన ప్రియుడు విగ్నేష్ శివన్ ను పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ క్రమంలోనే ఈమె పెళ్లికి సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇకపోతే జూన్ 9వ తేదీ మహాబలిపురంలో వీరి వివాహాన్ని ఎంతో ఘనంగా నిర్వహించుకున్నట్లు తెలుస్తోంది.ఇకపోతే తాజాగా నయనతార విగ్నేష్ తమ పెళ్లి గురించి మాట్లాడుతూ వీరి పెళ్లికి వచ్చే అతిథులు గురించి వీరి వివాహం తిరుపతిలో చేసుకోకపోవడానికి కారణాలు ఏమిటో తెలియజేశారు.

తాజాగా డైరెక్టర్ విగ్నేష్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విషయాలన్నింటినీకి క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా విగ్నేష్ మాట్లాడుతూ మై లవ్ నయన్ ను ఈనెల 9వ తేదీ మహాబలిపురంలో పెళ్లి చేసుకోబోతున్నాను అంటూ ఈయన పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చారు.మా పెళ్ళికి మా ఇరువురి కుటుంబ సభ్యులతో పాటు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరు కానున్నారని విగ్నేష్ తెలియజేశారు. ఇక పెళ్లికి వేదిక గురించి కూడా ఈయన క్లారిటీ ఇచ్చారు.

ముందుగా మా వివాహాన్ని తిరుపతిలో చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. అయితే ప్రయాణంలో సమస్యలు ఎదురవుతాయని, పలు సమస్యలను దృష్టిలో ఉంచుకొని చివరికి మా పెళ్లి వేదికను మహాబలిపురానికి మార్చమని ఈ సందర్భంగా విగ్నేష్ వెల్లడించారు. జూన్ 9వ తేదీ ఉదయం మా పెళ్లి జరగనుంది.ఇక మధ్యాహ్నం పెళ్లికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటామని ఈ సందర్భంగా తెలిపారు. ఇకపోతే పెళ్లయిన తర్వాత నయనతారతో కలిసి తాను 11వ తేదీ మీడియా ముందుకు వస్తానని విగ్నేష్ పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చారు.