నయనతార, విగ్నేష్ కి భారీ షాక్

ఈ మధ్య సెలబ్రిటీలు సరోగసి ద్వారా పిల్లని కనడం ఫాషన్ అయిపోయింది. అందం కోసం చాలా మంది హీరోయిన్స్  సరోగసి ద్వారా పిల్లని కంటున్నారు. మంచు లక్ష్మి, కరణ్ జోహార్ లాంటి వాళ్ళు సరోగసి ద్వారా పిల్లల్ని కన్నారు. తాజాగా ఈ లిస్ట్ లో నయనతార కూడా చేరింది.

నయనతార సరోగసి పద్ధతి ద్వారా ఇద్ద‌రు మ‌గ పిల్ల‌ల‌కు జన్మనిచ్చింది. అయితే నయనతార పెళ్లి జరిగి కేవలం నాలుగు నెలలు అవుతుంది. కాగా ఇప్పుడు నయనతార సరోగసి ద్వారా పిల్లలను కనడం వివాదానికి దారి తీసింది. నిజానికి సరోగసి పద్ధతి ద్వారా బిడ్డలకు జన్మనిచ్చే హక్కు ఉంది. కానీ దానికి కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి.

పెళ్లి చేసుకుని కాపురం చేసిన తర్వాత ఏదైనా లోపం వల్ల లేదంటే అనారోగ్య సమస్యల వల్ల పిల్లలు పుట్టనట్లయితే అప్పుడు మాత్రమే స‌రోగ‌సి ద్వారా పిల్లలను క‌నే హ‌క్కు ఉంటుంది. కానీ నయనతార పెళ్లి చేసుకున్న నాలుగు నెలలకే బిడ్డలకు జన్మనిచ్చింది. అంటే పెళ్లికి ముందే పిల్లలు కనేందుకు ప్లాన్ చేసుకున్నారు. కాబట్టి ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. అలాగే తమిళనాడు ఆరోగ్యశాఖ‌ మంత్రి ఈ విషయంపై విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు.