Nagarjuna: చై,సామ్ విడాకుల గురించి నేను మాట్లాడలేదు.. పుకార్ల పై క్లారిటీ ఇచ్చిన నాగార్జున!

Nagarjuna: టాలీవుడ్ క్యూట్ కపుల్ సమంత, నాగచైతన్యను విడిపోయి దాదాపు రెండు నెలలు దాటినా కూడా వారికి సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంది. ఇదే కాకుండా విడాకుల తర్వాత సమంతా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ నిత్యం ఏదో ఒక రకాల కొటేషన్లు షేర్ చేయడం వల్ల వార్తల్లో తరచుగా నిలుస్తూనే ఉంది. మరొకవైపు నాగచైతన్య కూడా పలు ఇంటర్వ్యూలలో, సోషల్ మీడియా వేదికగా విడాకుల గురించి, సమంత గురించి స్పందిస్తూ ఉన్నాడు.

ఇకపోతే అక్కినేని నాగార్జున కొడుకు నాగచైతన్య, సమంత విడాకుల విషయంలో పలు విషయాలను మాట్లాడారు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి.సమంత, నాగ చైతన్య మధ్య సమస్య ఏమిటన్నది నాకు తెలియదు.. కానీ మొదట సమంతానే విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకొని విడాకులకు అప్లై చేసింది.. ఆమె నిర్ణయాన్ని గౌరవించి నాగచైతన్య దానికి అంగీకారం తెలిపాడు.. అంతేకాకుండా పరువు గురించి ఆలోచిస్తూ నేను ఎలా రిసీవ్ చేసుకుంటాను అన్న విషయంపై నాగచైతన్య ఎక్కువగా బాధ పడ్డాడు.. అంటూ నాగార్జున స్పందించారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. ఈ విషయంపై తాజాగా స్పందించారు నాగార్జున.

 

అయితే తాజాగా నాగార్జున సోషల్ మీడియా లో వినిపిస్తున్న వార్తల్లో నిజం లేదు.. అవి కేవలం రూమర్స్ మాత్రమే అందులో ఎటువంటి నిజం లేదు అని క్లారిటీ ఇచ్చారు. దయచేసి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మవద్దని నాగార్జున కోరారు. సోషల్ మీడియాలో నా పేరుతో వస్తున్న కామెంట్స్ లో నిజం లేదు.. సమంత నాగచైతన్య విషయంలో నేను మాట్లాడినట్లు వస్తున్న వార్తలన్నీ కూడా అవాస్తవం అని చెప్పుకొచ్చారు నాగార్జున. వదంతులను వార్తలుగా మలచవద్దని మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నాను అంటూ నాగార్జున ట్వీట్ చేశారు. నాగార్జున చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.