మైల్ స్టోన్ కి దగ్గర్లో నాగార్జున

టాలీవుడ్ లో దాదాపు నలభై ఏళ్ళ నుండి స్టార్ హీరో గా వెలుగొందుతున్నాడు నాగార్జున. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ లాంటి స్టార్స్ నుండి పోటీని తట్టుకుని తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ సృష్టించుకున్నాడు నాగార్జున. తన కెరీర్ లో ఎవరు చెయ్యలేనన్ని ఎక్సపెరిమెంట్స్ చేసాడు నాగార్జున.

చిరంజీవి, బాలకృష్ణ తర్వాత నాగార్జున కూడా వంద సినిమాల మైల్ స్టోన్ కి దగ్గర్లో ఉన్నాడు. తన వందవ సినిమాకు తన ఇష్టమైన లెజెండరీ డైరెక్టర్ కే. రాఘవేంద్ర రావు ని దర్శకత్వం వహించమని నాగార్జున రిక్వెస్ట్ చేసాడు కానీ రాఘవేంద్ర రావు రిటైర్మెంట్ ఇచ్చేసాని చెప్పడంతో మోహన్ రాజా ని కూడా అడిగాడు, కానీ అది కూడా వర్క్ అవుట్ అవ్వలేదు.

తాజా సమాచారం ప్రకారం నాగార్జున తన వందో సినిమాని చాలా ప్రతిష్టాత్మకంగా ఉండేలా ప్లాన్ చేయాలని అనుకుంటున్నాం అని చెప్పాడు. నాగార్జున ఈ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ ను ఏ డైరెక్టర్ చేతిలో పెడతాడో.ఏ జోనర్ లో సినిమా ఉంటుందో అని అక్కినేని ఫ్యాన్స్ వేచి చూస్తున్నారు.

ప్రస్తుతం నాగార్జున ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ది గోస్ట్ ‘ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నాడు.  ఈ సినిమా వరల్డ్ వైడ్ గా అక్టోబర్ 5న దసరా కానుకగా రిలీజ్ చేయనున్నారు.