మైత్రీ నిర్మాతలకు ఇంత కోపం ఎందుకు వచ్చిందో ?

Mythri producers

Mythri producers

టాలీవుడ్ లీడింగ్ నిర్మాణ సంస్థల్లో మైత్రీ మూవీ మేకర్స్ ఒకటి. వరుస హిట్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు ఈ నిర్మాతలు. ఇటీవలే ‘ఉప్పెన’ అనే సూపర్ హిట్ సినిమా చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం వీరి నిర్మాణంలో ‘పుష్ప, సర్కారువారి పాట, అంటే సుందరానికి’ చిత్రాలతో పటు పవన్ కళ్యాణ్ 28వ సినిమాను నిర్మిస్తున్నారు. నిజానికి మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు ఎక్కువ వివాదాల జోలికి వెళ్లరు. సినిమా ప్రమోషన్ల సమయంలో తప్ప వేరే సమయాల్లో కనిపించరు కూడ. ఎప్పుడూ కూల్ నేచర్ తోనే ఉంటారు. అలాంటివారికి కూడ కోపం వచ్చింది.

అందుకు కారణం సోషల్ మీడియా నెగెటివ్ ట్రోలింగ్స్. ఈమధ్య సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ శృతిమించుతున్నాయి. కొందరైతే పనిగట్టుకుని మరీ టార్గెట్ చేస్తున్నారు. ఇలాంటి అనుభవమే ఎదురైనట్లుంది మైత్రీకి. అందుకే అలాంటి అభ్యంతరకర ట్వీట్లు చేసే వారిని బ్లాక్ చేస్తున్నామని, సోషల్ మీడియాలో ఆరోగ్యకరమైన వాతావరణం ఉండేలా చేయడానికి తమతోపాటు చేతులు కలపాలని తమ ఫాలోవర్లకు పిలుపునిచ్చారు. మైత్రీ నిర్మాతల ఆగ్రహం చూస్తే సోషల్ మీడియాలో నెగెటివ్ ట్రోలర్స్ ఏ స్థాయిలో ఉన్నారో అర్థమవుతోంది.