పిక్చ‌ర్ ప‌ర్‌ఫెక్ట్‌.. న‌లుగురు కెప్టెన్స్‌తో మెగాస్టార్ పిక్ వైర‌ల్‌

ఆరు ప‌దుల వ‌య‌స్సులోను కుర్ర హీరోల‌తో పోటీ ప‌డుతూ వ‌రుస సినిమాలు చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. మ‌ధ్య‌లో రాజ‌కీయాల వైపు వెళ్లిన‌ప్ప‌టికీ మ‌ళ్లీ సినిమాల‌లోకి వ‌చ్చి అల‌రిస్తున్నారు. తొమ్మిదేళ్ల గ్యాప్ త‌ర్వాత ఖైదీ నెం 150 చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన చిరుకు జ‌నాలు నీరాజ‌నాలు ప‌లికారు. ఆయ‌న సినిమా చూసి ప‌ర‌వ‌శించిపోయారు. చిరు మానియాకు బాక్సాఫీస్ బ‌ద్ద‌లైంది. రీ ఎంట్రీ త‌ర్వాత జోరు పెంచిన చిరంజీవి ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఆచార్య అనే సినిమా చేస్తున్నారు. సామాజిక నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ తుది ద‌శ‌కు చేరుకుంది. ఇందులో కాజ‌ల్ అగ‌ర్వాల్ కథానాయిక‌గా న‌టిస్తుంది.

ఇక మ‌రి కొద్ది రోజుల‌లో మ‌ల‌యాళ చిత్రం లూసిఫ‌ర్ రీమేక్ మొద‌లు పెట్ట‌నున్నాడు చిరు. మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రం ఇటీవ‌ల లాంచ‌నగా ప్రారంభ‌మైంది. తెలుగు నేటివిటీకి అనుగుణంగా ఈ సినిమాను మోహ‌న్ రాజా తెర‌కెక్కించ‌నున్నారు. ఇక ఈ సినిమా త‌ర్వాత వేదాళం రీమేక్‌ను మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌కత్వంలో చేయ‌నున్నారు చిరు. ప్ర‌స్తుతం ఈ సినిమా ప్రీ ప్రోడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. ఇక యువ ద‌ర్శ‌కుడు బాబీ ద‌ర్శ‌క‌త్వంలోను మెగాస్టార్ ఓ సినిమా చేయ‌నున్న‌ట్టు గ‌తంలో ప్ర‌క‌టించాడు. ప్ర‌స్తుతం ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన స్క్రిప్ట్ వ‌ర్క్ జ‌రుగుతుంది.

అయితే చిరంజీవితో సినిమాలు చేస్తున్న న‌లుగురు ద‌ర్శ‌కులు కొర‌టాల శివ‌, మెహ‌ర్ ర‌మేష్‌, మోహ‌న్ రాజా, బాబీలు రీసెంట్‌గా గ్రూప్ ఫోటో దిగారు. ఈ ఫొటోని చిరంజీవి త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ..నా 4 కెప్టెన్స్..నెక్స్ట్ ఫెంటాస్టిక్ 4 వీళ్ళే అంటూ కామెంట్ పెట్టాడు. ప్ర‌స్తుతం ఈ ఫోటో సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్ చ‌ల్ చేస్తుంది. ఈ ఫొటోని చూసిన అభిమానులు తెగ మురిసిపోతున్నారు.