మెగాస్టార్ చిరంజీవి వేగం పెంచారు. ఆయన మూడు కొత్త సినిమాలకు సైన్ చేసి ఉన్నారు. అవి పూర్తయితే కానీ కొత్తవాటికి కమిట్ అయ్యే వీలు లేదు. ఆయన మాటిచ్చిన దర్శకులు సైతం ఎప్పుడెప్పుడు మెగాస్టార్ నుండి పిలుపు వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందుకే చిరంజీవి చకచకా పనులు చేసుకుంటూ వెళ్తున్నారు. లాక్ డౌన్ సడలింపులు రావడంతో కొత్త చిత్రాన్ని స్టార్ట్ చేసి తీరాలని నిర్ణయించుకున్నారు. అందుకే మోహన్ రాజాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి ‘లూసిఫర్’ రీమేల్ పనులు మొదలుపెట్టమని చెప్పారు. చిరి నుండి పిలుపు అందుకున్న మోహన్ రాజా వెంటనే వర్క్ స్టార్ట్ చేశాడు.
చిత్ర సంగీత దర్శకుడు తమన్ తో కలిసి మ్యూజిక్ కంపోజిషన్ మొదలుపెట్టేశారు. ‘ఇది మన మెగాస్టార్ చిరంజీవిగారి మీద ప్రేమ చూపించాల్సిన సమయం. అభిమానులకు తప్పకుండా హై ఇచ్చే స్టఫ్ ఉంటుంది’ అంటూ ట్వీట్ చేశారు తమన్. ఇంకొన్ని రోజుల్లో కొరటాల శివతో చేసున్న ‘ఆచార్య’ షూటింగ్ ముగుస్తుంది. ఆ వెంటనే పెద్దగా గ్యాప్ తీసుకోకుండా వెంటనే సెట్స్ మీదకు రానున్నారు చిరంజీవి. ఇది మిగతా సినిమాల తరహాలో కాదు. కామెడీ, పాటలు వగైరా లాంటివి పెద్దగా ఉండవు. అంతా యాక్షణ కంటెంట్. కాబట్టి త్వరగానే చిత్రాన్ని ఫినిష్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు చిరంజీవి. అది కంప్లీట్ కాగానే మెహర్ రమేష్ లేదా బాబీతో ఇంకో చిత్రం స్టార్ట్ చేస్తారు.