మెగా మల్టీస్టారర్ ఆగమనం అప్పుడుకి ఫిక్స్.?

ప్రస్తుతం టాలీవుడ్ సినిమా నుంచి వస్తున్న పలు క్రేజీ మల్టీ స్టారర్ చిత్రాల్లో మెగాస్టార్ చిరంజీవి మరియు తన కొడుకు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబోలో బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న సినిమా “ఆచార్య”. మెగా ఫాన్స్ ఎపుడు నుంచో ఎదురు చూస్తున్న ఈ మోస్ట్ అవైటెడ్ సినిమా పలు కారణాల చేత ఇంకా ఒక పక్కా రిలీజ్ డేట్ ని మాత్రం తెచ్చుకోలేకపోయింది.

కానీ మరోపక్క సినిమాని మేకర్స్ వచ్చే ఏడాది సంక్రాంతి రేస్ లో నిలపాలని ప్లాన్ చేస్తున్నట్టుగా ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ బయటకి వచ్చింది. కానీ ఇప్పుడు ఈ మెగా మల్టీస్టారర్ ఆగమనం ఎప్పుడు అనేది తెలుస్తుంది. తాజా ఇన్ఫో ప్రకారం అయితే ఈ సినిమా ఈ ఏడాదిలోనే రిలీజ్ ఉంటుందట.

అంతే కాకుండా డిసెంబర్ నెలలో ఈ సినిమా రిలీజ్ ఉండొచ్చని తెలుస్తుంది. మరి ఇంకా దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో గ్లామరస్ హీరోయిన్స్ కాజల్ మరియు పూజా హెగ్డే మెగాస్టార్, చరణ్ ల సరసన నటిస్తున్న సంగతి తెలిసిందే.