ఓ టింబర్ డిపోలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సికింద్రాబాద్ పరిధిలోని బోయగూడలో ఉన్న టింబర్ డిపోలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 11 మంది సజీవ దహనం అయ్యారు. ప్రమాద సమయంలో గోడౌన్లో 12మంది ఉన్నారు. పెద్ద ఎత్తున మంటలు చెలరెగుతూ.. క్రమంగా డిపోలోని దుంగలు, కట్టెలకు మొత్తానికి విస్తరించినట్లు పోలీసులు తెలిపారు. 8 ఫైర్ ఇంజిన్ల సిబ్బంది గంటపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అగ్ని ప్రమాదంలో చనిపోయినవారిని బిట్టు(23), సికిందర్(40), దినేష్(35), దామోదర్(27), చింటు(17), సికిందర్(35), రాజేష్(25), రాజు(25), దీపక్(26), పంకజ్(26), గొల్లు(25)గా గుర్తించారు.