ఒక్క హిట్ కోసం తాపత్రయ పడుతున్న మంచు విష్ణు

సినిమా ఇండస్ట్రీ కి వచ్చి రెండు దశాబ్దాలు దాటుతున్నా…మంచు విష్ణు కెరీర్ లో ఒక్కటంటే ఒక్క బ్లాక్ బస్టర్ లేదు. ‘ఢీ’ ‘దేనికైనా రెడీ’, ‘దూసుకెళ్తా’ లాంటి హిట్స్ ఉన్నా…అవి సూపర్ హిట్స్ కావు. భారీ అంచనాల మధ్య విడుదలయిన ‘మోసగాళ్లు’ ప్లాప్ తర్వాత కొంత గ్యాప్ తీసుకుని ఇప్పుడు ‘జిన్నా’ సినిమాతో మన ముందుకు వస్తున్నాడు విష్ణు.

కొత్త దర్శకుడు ఇషాన్ సూర్య దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ పై విష్ణు కి చాలా నమ్మకం ఉంది. ఎప్పుడు లేనంతగా మూవీ ప్రమోషన్స్ భారీ రేంజ్ లో చేస్తున్నాడు. ఈ క్రమంలోనే మానవ ప్రయత్నానికి దైవ సంకల్పం కూడా తోడవ్వాలన్న ఉద్దేశంతో విష్ణు  జిన్నా  సినిమా హిట్ కోసం  యాదాద్రి నరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలను నిర్వహించినట్టు తెలుస్తోంది.

నిన్న విష్ణు యాదాద్రి నరసింహస్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలను చేయించారు.సినీ రచయిత కోన వెంకట్ తో కలిసి ఈయన స్వామి వారి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలను చేసాడు. రేపు ఈ సినిమా విడుదల కానుంది. సన్నీ లియోన్, పాయల్ రాజపుట్ హీరోయిన్స్ గా నటించిన ఈ మూవీ హిట్ అవుతుందో లేదో చూడాలి.