టీఆర్పీ స్టంట్ అంటూ పరువు మొత్తం తీసుకున్న మల్లెమాల… ఇవే తగ్గించుకుంటే మంచిది!

బుల్లితెరపై ప్రసారమయ్యే కార్యక్రమాలకు పెద్ద ఎత్తున టిఆర్పి రేటింగ్ రావడం కోసం ఎన్నో కొత్త కొత్త ఆలోచనలు చేస్తూ రేటింగ్ కోసం చాలా చీప్ ట్రిక్స్ ప్లే చేస్తూ ఎప్పటికప్పుడు నెటిజన్ల చేతిలో దారుణంగా ట్రోలింగ్ గురవుతున్నారు మల్లెమాల వారు.ఈ క్రమంలోనే ఈ వారం ప్రసారమైన శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంపై నెటిజన్లు దారుణంగా మండిపడుతున్నారు. ఈ విధంగా వీరు ఈ కార్యక్రమంపై ఆగ్రహం వ్యక్తం చేయడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే…

గతవారం ఇమ్మానియేల్ పూర్ణ పై చేయి వేయడంతో ఆమె పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే విధంగా రష్మీ కళ్లు తిరిగి పడిపోవడంతో అసలు ఏం జరిగింది అంటూ పెద్ద ఎత్తున అభిమానులు ఆందోళన చెందిన అప్పటికీ మరికొందరు మాత్రం కేవలం రేటింగ్ కోసమే ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేశారు అంటూ వారిపై గతంలోనే కొందరు ట్రోలింగ్ చేశారు. అయితే ఆదివారం ఈ కార్యక్రమం పూర్తి ఎపిసోడ్ ప్రసారమైంది. ఈ ఎపిసోడ్ లో భాగంగా టీఆర్పీ స్టంట్లు ఎలా ఉంటాయో చూపించారు. అందులో భాగంగా అందరూ రెచ్చిపోయారు.

YouTube video player

ఈ క్రమంలోనే రష్మి వేదికపై ఉన్నట్టుండి కళ్ళు తిరిగి కిందపడి పోతారు.అయితే ఒక్కసారిగా అందరూ ఏం జరిగిందా అని కంగారుగా వచ్చి చూడగా రష్మీ కన్నుకొడుతూ ఎలా ఉంది నా స్టంట్ అంటూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక పూర్ణ సైతం ఇమ్మానియేల్ పట్ల కోపంగా ప్రవర్తించింది. ఏకంగా నన్ను టచ్ చేయడానికి ఎంత ధైర్యం అని తిడుతూనే వేదికపై నుంచి దిగి వెళ్ళిపోయి తన సీట్లో కూర్చుంది. ఈ విషయం గురించి అందరూ కంగారు పడుతూ ఉండగా ఎలా ఉంది నా స్టంట్ పూర్ణ అందరికీ షాక్ ఇచ్చింది. ఇలా వీరి టిఆర్పి స్టంట్ చేయడం వల్ల మల్లెమాల వారి పై కొందరు నెటిజన్లు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇలాంటివి తగ్గించుకుంటే మంచిదంటూ కామెంట్లు చేయడమే కాకుండా రేటింగ్ కోసం ఇంకా ఎలాంటి దారుణాలకు పాల్పడతారు అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు.