థియేటర్లలోనే మహేష్ బాబు సినిమా

Major will release in theatres only
Major will release in theatres only
26/11 ముంబై దాడుల్లో దేశం కోసం ప్రాణాలను అర్పించిన దివంగత ఆర్మీ ఆఫీసర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘మేజర్’. అడివి శేష్ ఇందులో ఉన్నికృష్ణన్ పాత్రను చేస్తున్నారు.  శశి కిరణ్ తిక్కా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మహేష్ బాబు జిఎమ్‌బి ఎంటర్టైన్మెంట్ మరియు ఏప్ల‌స్ఎస్‌ మూవీస్ సహకారంతో సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.  శేష్ గత చిత్రాలు ‘ఎవరు, గూఢచారి’ చిత్రాలు మంచి హిట్లు కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. 
 
అన్ని పనులు పూర్తైన ఈ చిత్రాన్ని జూలై 2న రిలీజ్ చేయాలని అనుకున్నారు.  కానీ లాక్ డౌన్ కారణంగా థియేటర్లు మూతబడటంతో సినిమా రిలీజ్ మీద సందిగ్దత నెలకొంది.  థియేటర్లు లేవు కాబట్టి ఓటీటీలో రిలీజవుతుందని వార్తలొచ్చాయి.  కానీ చిత్రాన్ని థియేటర్లలోనే విడుదల చేయాలని మహేష్ అండ్ టీమ్ నిర్ణయించారు.  అందుకే ఇలాంటి సమయంలో సినిమా రిలీజ్ వాయిదా వేస్తున్నామని త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తామని అన్నారు.  పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమా విడుదలను ప్లాన్ చేశారు టీమ్.