‘మేజర్’ మరో ఘనత సాధించింది!!

అడివి శేషు హీరోగా నటించిన ‘మేజర్’  సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే.  రూ.32 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.70 కోట్ల కలెక్షన్లని కొల్లగొట్టింది. ఈ సినిమాలో అడివి శేషుకి జోడీగా సయీ మజ్రేకర్ నటించగా.. ప్రకాశ్ రాజ్, శోభిత ధూళిపాళ, రేవతి, మురళీ శర్మ ముఖ్యపాత్రలు పోషించారు.అయితే.. ఇప్పుడు ఈ ‘మేజర్’  మరో ఘనత సాధించింది.

అధికారికంగా ఇండియన్ ఇంటర్నేషన్‌ ఫిల్మ్ ఫెస్టివల్‌కి ఇండియన్ పనోరమా ఆధ్వర్యంలో 53వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) గోవాలో జరగనుంది. నవంబర్ 20 నుంచి 28 వరకు జరిగే ఐఎఫ్ఎఫ్ఐలో దేశవ్యాప్తంగా పలు చిత్రాలు ప్రదర్శిస్తారు. దానికి సంబంధించిన లిస్ట్‌ని తాజాగా ఇండియన్ పనోరమా జ్యూరీ ప్రకటించింది. అందులో 25 ఫీచర్ ఫిల్మ్‌లు, 20 నాన్ ఫీచర్ ఫిల్మ్‌ ఉన్నాయి. వాటిలో అడివి శేషు హీరోగా నటించిన ‘మేజర్’ కూడా ఉండడం గమనార్హం.

ఈ విషయాన్ని చెబుతూ ‘మేజర్’టీమ్    ట్విట్టర్‌లో తన సంతోషాన్ని అభిమానులతో  పంచుకుంది. అదే ట్విట్టర్ లో ”ఇప్పటికీ మేజర్‌కి ప్రశంసలు అందుతూనే ఉన్నాయి. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా 2022 (IFFI) కోసం అధికారికంగా ఎంపికైంది” అని రాసుకొచ్చింది. అలాగే ఆ పోస్ట్‌లో.. అడివి శేషు, శశి కిరణ్ తిక్క,  సయీ మంజ్రేకర్‌, మహేశ్‌ బాబు, సోనీ పిక్చర్స్ ఇండియాని ట్యాగ్ చేసింది. కాగా.. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్‌గా తెరకెక్కిన ఈ చిత్రం మంచి విజయాన్ని నమోదు చేసింది. తెలుగుతోపాటు హిందీ, మలయాళంలోనూ విడుదలై విజయాన్ని అందుకుని మంచి కలెక్షన్లని సాధించిండం విశేషంగా చెప్పుకోవాలి. కంగ్రాట్స్.. ‘మేజర్’ టీమ్!!