Mahesh Fans Degraded : షాకింగ్ : దిగజారిన మహేష్ ఫ్యాన్స్.. నిర్మాతలపై ఇలాంటి ట్రోల్సా?

Mahesh Fans Degraded : ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా దర్శకుడు పరశురామ్ పెట్ల కాంబోలో “సర్కారు వారి పాట” అనే చిత్రంలో నటిస్తున్నారు. అయితే ఈ సినిమాని మహేష్ వరుసగా మూడు బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత చేస్తుండడంతో అభిమానుల్లో ఎనలేని హైప్ నెలకొంది.

అయితే ఆ హైప్ కి తగ్గట్టు గానే చిత్ర నిర్మాతలు సినిమాని అత్యున్నత ప్రమాణాలతో తెరకెక్కిస్తున్నారు. కానీ సినిమాకి సంబంధించి అప్డేట్స్ పరంగా మేకర్స్ కాస్త లేట్ గానే అప్డేట్స్ అందిస్తున్నారు. అలాగే ఈ సంక్రాంతికి ఇస్తా అన్న అప్డేట్ ని కూడా లాస్ట్ మినిట్ లో ఒక అధికారిక ప్రెస్ నోట్ తో ఇవ్వడం లేదని ప్రకటన ఇవ్వడంతో సోషల్ మీడియాలో మహేష్ అభిమానులు ఆగ్రహానికి లోనయ్యారు.

దీనితో ఏకంగా ఈ సినిమా నిర్మాతలకు వ్యతిరేఖంగా ఇండియా వైడ్ నెగిటివ్ ట్రెండ్ చెయ్యడం స్టార్ట్ చేశారు. కానీ ఇది నిజంగా ఒక దిగజారుడు ట్రెండ్ అని చెప్పాలి. ‘యూజ్ లెస్ స్పెర్మ్ మైత్రి’ అంటూ హాష్ ట్యాగ్ తో ఈ ట్రెండ్ చేస్తున్నారు. ఇది ఒక రకంగా పర్సనల్ ట్రోల్ అని చెప్పాలి.

ఎంత అప్డేట్ ఆపితే మాత్రం ఈ తరహా ట్రోల్ చెయ్యడం నిజంగా అభ్యంతరకరం. ఒకవేళ దీనిని గాని చిత్ర నిర్మాతలు సీరియస్ గా తీసుకుంటే మహేష్ అభిమానులకి ఖచ్చితంగా జీవితాలు తలకిందులు అయ్యిపోవడం గ్యారెంటీ. ఈ తరహా ట్రోల్స్ అయితే కరెక్ట్ కాదు.