వివాదాస్పదంగా మారిన మహేష్ బాబు ట్వీట్

సాధారణంగా వివాదాలకు దూరంగా ఉండే మహేష్ బాబు ట్వీట్ పై కొందరు కోపంగా ఉన్నారు. మరీ ముఖ్యంగా అక్కినేని అభిమానులు మహేష్ బాబు ని ట్రోల్ చేస్తున్నారు. నిన్న నాగార్జున అక్కినేని తన పుట్టినరోజు. ఆ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా సెలబ్రిటీలు..అభిమానులు తమదైన శైలిలో విషెస్ తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే సూపర్ స్టార్ మహేష్ సైతం నాగార్జునని  ట్విటర్  వేదికగా విష్ చేసారు. హ్యాపీ ‘బర్త్ డే. మీకు ఎల్లప్పుడు సంతోషం.. సమృద్ది కలిగి ఉండాలని కోరుకుంటున్నా ను’ అని రాసుకొచ్చారు.

అయితే  మహేష్ విషెస్ లో తనకంటే వయసులో పెద్ద అయిన నాగార్జున మీద  మర్యాద లేదంటూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. నాగార్జునని సర్ అని పిలవడం ద్వారా అతినికి కొంత గౌరవం కల్పించినట్లు అవుతుంది.

ఆయన వయసు 63 ఏళ్లు. ఆయన  వయసునైనా రెస్పెక్ట్ చేయాలి. కనీసం అతని పోస్ట్ లో గారు..అన్నా అని కూడా లేకపోవడం శోచనీయం అంటూ కొంత మంది అభిమానలు  అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

మరో నెటిజెన్ ” మీ ఇండస్ర్టీ లెజెండ్కి  కొంత గౌరవం ఇవ్వండి ప్లీజ్” అని రాసుకొచ్చారు. మరి వీటిపై మహేష్ రియాక్షన్ ఉంటుందా? అన్నది చూడాలి. మహేష్-నాగ్  మంచి సన్నిహితులు. ఇటీవలే నాగార్జున కథానాయకుడిగా నటిస్తున్న ‘ది ఘోస్ట్’ ట్రైలర్ ని మహేష్ లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా నాగార్జున మహేష్ తో మల్టీస్టారర్ చేయాలనుకుంటున్న విషయాన్ని రివీల్ చేసారు.