ఉగాది రోజునే రిస్క్ చేస్తున్న మహేష్ బాబు

Mahesh Babu taking risk

Mahesh Babu taking risk

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ‘సర్కారువారి పాట’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కరోనా కారణాల వలన సినిమా అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంది. అమెరికాలో షూటింగ్ చేయాల్సి ఉండగా లాక్ డౌన్ మూలంగా పలుమార్లు వాయిదాపడింది. చివరకు టీమ్ అమెరికా వెళ్లడం వీలుకాక దుబాయ్ వెళ్లి షూటింగ్ జరుపుకుని వచ్చారు. ఇక సెకండ్ షెడ్యూల్ అయినా అమెరికాలో మొదలుపెట్టాలి అనుకునేలోపే మళ్ళీ కరోనా సెకండ్ వేవ్ మొదలైంది. ఆ దెబ్బతో షూట్ మళ్ళీ వాయిదాపడింది. చూసి చూసి టీమ్ ఇక అమెరికాలో అయితే కుదరదని భావించి మళ్ళీ దుబాయ్ లొకేషన్లోనే చేద్దాం అనుకున్నారు.

కానీ అది కూడ కుదరలేదు. ఇక చేసేది లేక ఇండియాలోనే షూటింగ్ పెట్టుకున్నారు. కరోనా కేసులు ఎక్కువవుతున్నా కూడ చిత్రీకరణ జరపాలని నిర్ణయించుకున్నారు. అది కూడ ఈరోజు ఉగాది పండుగ రోజు నుండే షూటింగ్ చేస్తున్నారు. మహేష్ సినిమా అంటే ప్రతోరోజూ వందల మంది సెట్లో పనిచేస్తూ ఉంటారు. కాబట్టి కరోనా తాకిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అయినా కూడ మహేష్ రిస్క్ తీసుకుంటున్నారు. ఈరోజు నుండే షూటింగ్లో పాల్గొంటున్నారు. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని చిత్రీకరణ జరపనున్నారట. ఈ సంగతి తెలిసిన అభిమానులు జాగ్రత్తగా ఉండాలని మహేష్ బాబుకు సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ కథానాయకిగా నటిస్తోంది.