Mahesh Babu : ఇన్సైడ్ టాక్ : పాపం మహేష్ సినిమాని ఇలా కానిచ్చేస్తున్నారట ..!

Mahesh Babu :  సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా “సర్కారు వారి పాట” కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు పరశురామ్ పెట్ల తో ఫస్ట్ టైం మహేష్ బాబు చేస్తున్న సినిమా ఇది కావడంతో భారీ స్థాయి అంచనాలు దీనిపై నెలకొన్నాయి. ముఖ్యంగా మహేష్ కెరీర్ లో వరుస హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత వస్తున్న సినిమా ఇది కావడంతో అంతా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మరి ఇదిలా ఉండగా ఈ సినిమా షూటింగ్ ఆల్ మోస్ట్ కంప్లీట్ అయ్యిపోయింది అనుకునే లోపు ట్రిపుల్ ఆర్(RRR) సినిమా సంక్రాంతికి రావడంతో దీనిని వాయిదా వేసుకున్నారు. అప్పటికే 90 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ భారీ సినిమా అది కంప్లీట్ చేద్దాం అనుకునేసరికి మహేష్ కి కరోనా ఎటాక్ అయ్యింది. మరి అయినా మేకర్స్ సినిమా షూటింగ్ ని చేస్తున్నారట.

అదెలా అంటే అసలు మహేష్ బాబు లేకుండానే ఈ సినిమా షూటింగ్ చేస్తున్నారట. ఇండస్ట్రీ వర్గాల్లో మరో ఆసక్తికర టాక్ ఏమిటంటే మహేష్ డూప్ ని పెట్టి ఈ షూటింగ్ ని కానిచ్చేస్తున్నారట. ప్రస్తుతం ఈ షూటింగ్ నే విశాఖ పరిసర ప్రాంతాల్లో జరుపుతున్నట్టు వినికిడి. మొత్తానికి మాత్రం అసలు మహేష్ లేకుండానే సినిమా షూటింగ్ జారిపోతుండడం ఆసక్తిగా మారింది.