రాముడి పాత్ర‌లో క‌నిపించ‌నున్న మ‌హేష్‌.. రావ‌ణుడిగా బాలీవుడ్ స్టార్ హీరో

మేక‌ర్స్ స‌రికొత్త ఆలోచ‌న‌ల‌తో ప్రేక్ష‌కుల‌కు స‌రికొత్త వినోదాన్ని అందించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా చారిత్రాత్మ‌క చిత్రాలు లేదంటే పీరియాడిక‌ల్ మూవీస్‌పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు. ఇప్ప‌టికే తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల‌లో ఇలాంటి చిత్రాలు రూపొందుతుండ‌గా, ఆ జాన‌ర్‌లోనే మ‌రి కొన్ని సినిమాలు ప్రీ ప్రొడ‌క్షన్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటున్నాయి. అయితే మ‌హేష్ బాబు హీరోగా రామాయణ ఇతివృత్తం ఆధారంగా అల్లు అరవింద్, మధు మంతెన హిందీలో భారీ బడ్జెట్‌తో ఓ సినిమా నిర్మించనున్నారని టాక్స్ వినిపిస్తున్నాయి.

‘దంగల్‌’ దర్శకుడు నితీష్‌ తివారీ, ‘మామ్‌’ దర్శకుడు రవి ఉడయార్ ఈ చిత్రాన్ని ‌ డైరెక్ట్‌ చేయనున్నారు. అయితే ఈ సినిమాలో రాముడి పాత్ర‌లో మ‌హేష్ బాబు క‌నిపించ‌నున్నాడ‌ని, రావ‌ణుడిగా బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోష‌న్, సీత పాత్ర‌లో దీపికా ప‌దుకొణే న‌టించ‌నున్న‌ట్టు వినికిడి. దాదాపు 1500 కోట్ల బ‌డ్జెట్‌తో ఈ సినిమాను తెర‌కెక్కించ‌నున్నారు. ఈ వార్త‌తో సినిమాపై భారీ అంచ‌నాలే పెర‌గ‌గా, ఇందులో ఎంత నిజ‌ముంద‌నేది తెలియాల్సి ఉంది. మ‌రోవైపు మ‌హేష్ బాబు-రాజ‌మౌళి సినిమాకు సంబంధించి కూడా ఆస‌క్తిక‌ర వార్త చ‌క్క‌ర్లు కొడుతుంది.

ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి- సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు కాంబినేష‌న్‌లో ఓ సినిమా ఉంటుంద‌న్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాపై తాజాగా ఓ వార్త చ‌క్క‌ర్లు కొడుతుంది. అడవుల్లో సాగే యాక్షన్‌ అడ్వెంచర్‌గా ఈ సినిమా ఉండనుందట. ఆఫ్రికన్‌ అడవుల్లో చిత్రీకరణ జరిపే ఆలోచనలో రాజమౌళి ఉన్నారని టాక్‌. 2022 చివ‌రలో ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్ల‌నున్న‌ట్టు టాక్. ప్ర‌స్తుతం మ‌హేష్ బాబు.. ప‌ర‌శురాం ద‌ర్శ‌క‌త్వంలో స‌ర్కారు వారి పాట అనే సినిమా చేస్తున్నాడు. దుబాయ్‌లో చిత్ర షూటింగ్ జ‌రుగుతుండ‌గా, ఈ సినిమాలో కీర్తి సురేష్ క‌థానాయిక‌గా న‌టిస్తుంది. ఈ మూవీ త‌ర్వాత మ‌హేష్ క్రేజీ సినిమాల‌తో అల‌రించ‌నున్నాడు.