తెలంగాణ అనారోగ్యంతో మృతిచెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి తన ఇంట్లోనే కన్నుమూశారు. యుక్త వయసు నుంచి వెంకటనర్సయ్య రాజకీయాల్లో ఉన్నారు. మధిర శాసనసభ స్థానానికి రెండుసార్లు సీపీఎం ఎమ్మెల్యేగా ఆయన ప్రాతినిధ్యం వహించారు.

2009 శాసనసభ ఎన్నికలకు ముందు పార్టీ అవలంభించిన విధానాలు, రాష్ట్ర అగ్రనాయకత్వం తీరు నచ్చక పార్టీకి, శాసనసభ సభ్యత్వానికి, మరో నెలలో గడువు ముగుస్తుందనగా రాజీనామా చేశారు. చనిపోయేంత వరకు పార్టీ సిద్ధాంతలకు కట్టుబడి పనిచేశారు. పార్టీ అధిష్ఠానం తీరుపై అసంతృప్తితో 2009లో పార్టీకి, శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేసిన ఆయన ఎన్నో ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నారు.
కట్టా వెంకటనర్సయ్య మృతి పట్ల సీపీఎం జిల్లా నాయకులు, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. అరుదైన నేత అనీ… ఎప్పుడూ, ఎక్కడా రాజీ పడకుండా విలువలే ఆస్తిగా బతికారని ఆయనతో అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు
