పాపం కొరటాల..ఈ సమస్యలో ఇరుక్కుపోయాడట అందుకే సినిమా ఆలస్యం.!

టాలీవుడ్ లో తనదైన సినిమాలతో ముద్రవేసి బ్లాక్ బస్టర్ దర్శకునిగా పేరు తెచ్చుకున్న దర్శకుడు కొరటాల శివ. అయితే కొరటాల శివ తన కెరీర్ లో మాత్రం అసలు ఊహించని రేంజ్ డిజాస్టర్ ని అందుకుందాన్ని ఎప్పుడూ అనుకోకపోవచ్చు. 

ఆ రేంజ్ మెగా ఎపిక్ డిజాస్టర్ ని మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లతో చేసిన “ఆచార్య” భారీ చిత్రం ఊహించని ఫలితాన్ని అందుకోవడంతో కొరటాల మాత్రం కొన్నాళ్ల పాటు సైలెంట్ అయ్యిపోయారు. దీనితో ఎన్టీఆర్ తో నెక్స్ట్ చేస్తున్న చిత్రం మరింత ఆలస్యం అవుతూ వస్తుంది. 

అయితే ఇది వేరు అది వేరు అనుకున్నారు కానీ నిజానికి ఆచార్య వల్ల ఎన్టీఆర్ సినిమా ఇప్పుడు మొదలు కావట్లేదట. దీనికి బలమైన కారణం కూడా ఉందని తెలుస్తుంది. కొరటాల ఇంకా ఆచార్య నష్టాల సెటిల్మెంట్స్ లోనే ఉన్నాడట. వాటిని ఒకో ఏరియాకి సంబంధించి ఫాలో అప్ చేస్తూ వస్తుండడంతో ఎన్టీఆర్ సినిమా ఇంకా స్టార్ట్ అవ్వలేదని టాక్. 

ప్రస్తుతం అయితే ఆంధ్ర హక్కులు కి సంబంధించి సెటిల్ చేస్తున్నారట. ఇక ఇవి కూడా అయ్యాక ఎన్టీఆర్ సినిమాలోకి గాని కొరటాల రాదని తెలుస్తుంది. మొత్తానికి అయితే కొరటాల ఇలా ఇరుక్కుపోయాడు.