ఇన్ స్టాగ్రామ్ లో మోదీని దాటిన కోహ్లీ !

pm modi speaks to the nation on corona virus

సోషల్ మీడియా .. ప్రస్తుతం చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు తెల్లవారిన సమయం నుండి రాత్రి పడుకునేవరకు అందులోనే మునిగితేలుతుంటారు. ఇక ప్రముఖ సోషల్ మీడియా ఇన్ స్టాగ్రామ్ లో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓ అరుదైన రికార్డు క్రియేట్ చేశాడు. హైప్ ఆడిటర్ అదే సంస్థ ప్రపంచవ్యాప్తంగా సమాచారాన్ని సేకరించి, విశ్లేషించిన అనంతరం ఇన్ స్టాగ్రామ్ లో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీని విరాట్ కోహ్లీ అధిగమించారని వెల్లడించింది.

Anushka Sharma Virat Kohli
  

హైప్ ఆడిటర్ జాబితా ప్రకారం, కోహ్లీ 12వ స్థానంలో ఉండగా, మోదీ 20వ స్థానంలో నిలిచారు. ఆ తరువాతి స్థానాల్లో విరాట్ భార్య అనుష్క 26వ స్థానంలో నిలిచారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఇన్ స్టాగ్రామ్ లో నంబర్ వన్ స్థానంలో ఫుట్ బాలర్ క్రిస్టియానా రొనాల్డో ఉండగా, మరో ఫుట్ బాల్ ఆటగాడు లియోనెల్ మెస్సీ నాలుగో స్థానంలో ఉన్నారు.

ఇండియా తరఫున కోహ్లీ తొలి స్థానంలో, ఆపై మోదీ, అనుష్క, దీపికా పదుకొనే తదితరులు ఈ జాబితాలో స్థానం సంపాదించుకున్నారు.
ఇక ట్విట్టర్ సైతం ఈ సంవత్సరం అత్యధికులు ప్రస్తావించిన ఆటగాడిగా కోహ్లీ నిలిచాడని ప్రకటించడం గమనార్హం. అత్యధిక లైక్ లను పొందిన ట్వీట్ గా, గత ఆగస్టులో తాను తండ్రిని కాబోతున్నానని కోహ్లీ చేసిన ట్వీట్ నిలిచింది.