కోహ్లీ , తమన్నా కి కేరళ హైకోర్టు షాక్ ..ఏమైందంటే ?

virat

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి కేరళ హైకోర్టు షాకిచ్చింది. ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్‌ గేమ్స్‌ వివాదంలో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌కోహ్లీ, టాలీవుడ్‌ నటి తమన్నా భాటియాకు మరోసారిఎదురు దెబ్బ తగిలింది. వీరితోపాటు మాలీవుడ్‌ నటుడు అజు వర్గీస్‌కు కేరళ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

ఈ ముగ్గురు ఆన్‌లైన్ రమ్మీ గేమ్‌కు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో ఆన్‌లైన్ ‌రమ్మీ గేమ్స్‌కు బ్రాండ్‌ అంబాసిడర్స్‌గా వున్న వీరిని దీనిపై సమాధానం చెప్పాల్సిందిగా బుధవారం నోటీసులు జారీ చేసింది. ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ వెబ్‌సైట్లకు సెలబ్రిటీలు ప్రచారం చేయడాన్ని తప్పుపడుతూ, వీటిని రద్దుచేయాలని కోరుతూ త్రిసూర్‌కు చెందిన పోలీ వర్గీస్‌ కేరళ హై కోర్టులో పిల్ దాఖలు చేశారు.

దీనిని విచారించిన హైకోర్టు తాజాగా నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంలో వివరణ ఇ‍వ్వాల్సిందిగా కేరళ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఆదేశించింది. కాగా, ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ గేమ్స్‌ను ప్రమోట్ చేస్తున్న పలువురు సెలబ్రిటీలు, క్రికెటర్లపై మద్రాస్ హైకోర్టు గతేడాది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆన్‌లైన్ బెట్టింగ్ గేమ్స్ వల్ల ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, వీటిని ఎందుకు ప్రమోట్ చేస్తున్నారని సెలబ్రిటీలపై, ఎందుకు కఠిన చర్యలు తీసుకోవడం లేదని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.