పిచ్చి పీక్స్ కెళ్లడమంటే ఇదేనా? కొత్తగా పెళ్లయిన ఆ జంటపై నెటిజన్ల ఆగ్రహం?

kerala couple trolled for their wedding photoshoot

ఒకే ఒక్క ఫోటో.. ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. అది కూడా నెగెటివ్ గా… నెటిజన్ల ఆగ్రహానికి గురవుతూ.. ఇంతకీ ఆ ఫోటోలో ఏమున్నది అంటారా? ఇప్పుడు మీరు చూస్తున్న ఆ ఫోటో గురించే మనం మాట్లాడుకునేది. ఆ ఫోటోలో కనిపిస్తున్నది కొత్త జంట. ఇటీవలే మ్యారేజ్ అయింది. కరోనా వల్ల ఎక్కువ మందికి చెప్పకుండా.. కొందరినే పిలిచి పెళ్లి చేసుకున్నారు.

kerala couple trolled for their wedding photoshoot
kerala couple trolled for their wedding photoshoot

అంతవరకు బాగానే ఉంది.. పెళ్లయితే సింపుల్ గా చేసుకున్నాం కానీ.. కనీసం వెడ్డింగ్ షూట్ అయినా కొత్తగా, గ్రాండ్ గా చేసుకుందాం అని అనుకున్నారు. వెంటనే ఓ ఫోటోగ్రాఫర్ ను పిలిపించుకున్నారు. ప్రకృతి ఒడిలోకి వెళ్లారు. అక్కడే వెరైటీ ఫోటోలు తీసుకోవడం మొదలు పెట్టారు.

వాళ్ల పోస్ట్ వెడ్డింగ్ ఫోటోషూట్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతే.. నెటిజన్లు భగ్గుమన్నారు. అదేం ఫోటో. బట్టలు లేకుండా.. నగ్నంగా ఉండి.. కేవలం ఒకే ఒక తెల్లని వస్త్రాన్ని ధరించి ఆ పిచ్చి ఫోటోలు ఏంది? ఇటువంటి ఫోటోలు తీసుకొని.. సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. ఏం సాధిస్తారు. నేటి జనరేషన్ కు మీరిచ్చే సందేశం ఏంటి? అంటూ నెటిజన్లు ఆ ఫోటోపై ట్రోల్స్ మొదలు పెట్టారు.

అయితే.. నెటిజన్ల ట్రోల్స్ కు ఆ జంట దీటైన సమాధానం చెప్పడానికి ప్రయత్నించినప్పటికీ.. ఏదో చేద్దామని ఏదో చేసి ఆ కొత్త జంట అడ్డంగా బుక్కయిపోయింది పాపం.