కోయంబత్తూరు దక్షిణ స్థానం నుంచి బ‌రిలోకి క‌మ‌ల్..అదే రీజన్ !

తమిళనాడులో అన్ని రాజకీయ పార్టీలు కూడా తమ అభ్యర్థుల జాభితాను , అలాగే ఎవరెవరు ఎక్కడి నుండి పోటీ చేస్తున్నారో వరుసగా ప్రకటిస్తున్నారు. ఒకే విడత లో 173 మంది డీఎంకే ఇప్పటికే తమ జాభితా ప్రకటించింది. ఇక అన్నాడీఎంకే కూడా ఇప్పటికే పలువురిని ఫైనల్ చేసింది. ఇక ఈ ఎన్నికల్లో మూడో కూటమిగా పలు పార్టీల మద్దతుతో బరిలోకి దిగుతున్న ఎంఎన్‌ఎం కూడా తమ అభ్యర్థుల జాభితా ను ప్రకటిస్తుంది. ఇదిలా ఉంటే .. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్య‌ర్థు‌ల గురించి సినీ న‌టుడు క‌మ‌ల హాస‌న్‌ కు చెందిన మక్కల్‌ నీది మయ్యం (ఎంఎన్‌ఎం) వ‌ర్గాలు ప‌లు వివ‌రాలు తెలిపాయి.

kamal to contest from kovai

త‌మ పార్టీ అధ్యక్షుడు కమల హాసన్‌ కోయంబత్తూరు దక్షిణ స్థానం నుంచిపోటీ చేయనున్నారని వెల్ల‌డించాయి. ఆ స్థానంలో తెలుగువారు ఎక్కువగా ఉండడం, త‌న అభిమానులూ ఆ నియోజ‌క‌వ‌ర్గంలో అధికంగా ఉండ‌డంతో ఇక్క‌డి నుంచే పోటీ చేయాల‌ని క‌మ‌ల్ నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ విష‌యంపై క‌మ‌ల హాస‌న్ స్పందిస్తూ… తన తండ్రి తనను ఐఏఎస్‌ అధికారిగా చూడాలనుకున్నారని చెప్పారు. అయితే తాను ఆయన కలల్ని నిజం చేయలేకపోయానని తెలిపారు. ఈ నేప‌థ్యంలోనే తమ పార్టీలో పలువురు మాజీ ఐఏఎ్‌సలకు చోటు కల్పించానని చెప్పారు.

రాజకీయాలు తన వృత్తి కాదని చెప్పారు. త‌మ పార్టీ కార్యకర్తల కోరిక మేరకే తాను కోయంబత్తూరు దక్షిణ స్థానం నుంచి పోటీ చేస్తున్నాన‌న్నారు. కాగా, గ‌త పార్లమెంటు ఎన్నికల్లో ఎంఎన్‌ఎం అభ్యర్థికి ఈ స్థానం నుంచే 11 శాతానికి పైగా ఓట్లు వ‌చ్చాయి. క‌మ‌ల్ పార్టీ తరఫున చెన్నైలోని మైలాపూర్‌ నియోజకవర్గం నుంచి సినీ‌ నటి శ్రీప్రియ బ‌రిలోకి దిగుతున్నారు.