అవును మేమిద్దం విడిపోతున్నాం: చై – సామ్

అయిపోయింది.. అధికారిక ప్రకటన వచ్చేసింది. అక్కినేని నాగచైతన్య, సమంత అధికారికంగా విడిపోయారు. వీరిద్దరి మధ్యా వైవాహిక బంధానికి ముగింపు పడింది. ‘మేం భార్యా భర్తలుగా విడిపోయినా, మా ఇద్దరి స్నేహబంధం అలాగే ఉంటుంది.. అంటూ, నాగచైనత్య, సమంత అధికారికంగా ప్రకటించేశారు.
గత కొద్ది రోజులుగా చైతూ, సామ్ విడిపోతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.

ఆ ప్రచారాన్ని ఇద్దరిలో ఎవరూ ఖండించలేదు. కానీ, వారిద్దరూ విడిపోయే ప్రశక్తే లేదంటూ, కవర్ చేసేందుకు ఇరువురి అభిమానులూ నానా పాట్లూ పడ్డారు. నిజానికి సోషల్ మీడియాలో ‘సమంత అక్కినేని’ అనే పేరును తీసేసి ‘ఎస్’ అని మాత్రమే సామ్ పెట్టుకోవడం దగ్గర నుంచీ అభిమానులకీ, అందరికీ డౌట్ వచ్చేసింది. అదిప్పుడు నిజమని తేలిందంతే.

నాగచైతన్య, సమంత కలిసి ‘ఏం మాయ చేశావె’, ‘మనం’ తదితర సినిమాల్లో కలిసి నటించారు. సుదీర్ఘ కాలం పాటు వీరిద్దరి మధ్యా ప్రేమ నడిచింది. వీరిద్దరి ప్రేమకీ ఇరుకుటుంబాలూ ఆమోద ముద్ర వేయడంతో అంగరంగ వైభవంగా వీరి వివాహాన్ని జరిపించారు పెద్దలు. తెలుగు సినీ పరిశ్రమలో ముచ్చటైన జంటగా చైతూ, సామ్ నిత్యం వార్తల్లోకెక్కేవారు. కానీ, ఈ బంధం ఇలా అర్ధాంతరంగా విడిపోవడం శోచనీయం.